Chahal – Dhanashree: చాహల్-ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు.. భరణం ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..
- చాహల్ ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు..
- రూ. 4.75 కోట్లు భరణం చెల్లించనున్న చాహల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chahal – Dhanashree: స్టార్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకులు కొలిక్కి వచ్చాయి. రేపటిలోగా తీర్పు ఇవ్వాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టుని ఆదేశించింది. బాంబే హైకోర్టు ఆదేశం ప్రకారం, విడాకుల తర్వాత 6 నెలల కూలింగ్ పీరియడ్ను వదులుకోవడానికి ఈ జంటకు అనుమతి ఇచ్చింది. కూలింగ్ పీరియడ్ని వదులుకోవాలన్న పిటిషన్ని ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా, ఈ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరుపున పాల్గొనేందుకు, చాహల్-ధనశ్రీల విడాకుల పిటిషన్ని మార్చి 20 లోగా నిర్ణయించాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టుని ఆదేశించింది.
Read Also: Elon Musk: జో బిడెన్ వ్యోమగాములను భూమిపైకి తీసుకురానివ్వలేదు?.. కారణం చెప్పిన మస్క్..
Also Read
- Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
- Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్లోకి ఎంట్రీ..
- World Cup 2027: తిలక్ వర్మకు గోల్డెన్ ఛాన్స్.. బీసీసీఐ ప్లాన్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా ఇదే..
- Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్గా బాధ్యతలు స్వీకరణ..
ఈ జంట 2020 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. జూన్ 2022 నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ జంట కూలింగ్ పీరియడ్ను వదులుకోవాలని పిటిషన్తో పాటు ఒక దరఖాస్తును కూడా దాఖలు చేశారు. సెక్షన్ 13B(2) ప్రకారం, కుటుంబ కోర్టు పరస్పర విడాకుల పిటిషన్ను దాఖలు చేసిన తేదీ నుండి ఆరు నెలల తర్వాత మాత్రమే పరిగణించగలదు. సెటిల్మెంట్, మళ్లీ కలిసి ఉండే అవకాశాలు పరిశీలించడానికి కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇవ్వబడుతుంది. చాహల్, ధనశ్రీ రెండేళ్లుగా దూరంగా నివసిస్తుండటంతో ఈ కేసులో కూలింగ్ ఆఫ్ పీరియడ్ వర్తించదని బాంబే హైకోర్టు భావించింది.
చాహల్ తన విడిపోయిన భార్య ధనశ్రీకి శాశ్వత భరణం కింద రూ. 4.75 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, చాహల్ ఇప్పటి వరకు రూ. 2 కోట్ల 37 లక్షల 55 వేలు మాత్రమే చెల్లించినట్లు చెబుతున్నారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోవడాన్ని కోర్టు నిబంధనల్ని పాటించకపోవడంగా పరిగణించింది. అందువల్ల కూలింగ్ ఆఫ్ పిటిషన్ తిరస్కరించారు. బుధవారం, బాంబే హైకోర్టు ఈ జంట ఇప్పటికే రెండున్నర సంవత్సరాలకు పైగా విడివిడిగా గడిపారని పేర్కొంది, మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి వీలుగా సమ్మతి నిబంధనలకు అనుగుణంగా తీర్పు ఇచ్చింది. రాబోయే ఐపీఎల్ సీజన్ కారణంగా గురువారం (మార్చి 20) నాటికి విడాకుల పిటిషన్ను నిర్ణయించాలని కుటుంబ కోర్టును కోరారు.
తాజావార్తలు
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!