World Cup Qualifiers 2023: వన్డే క్రికెట్లో జింబాబ్వే సరికొత్త రికార్డు.. పాకిస్తాన్ కూడా సాధించలేకపోయింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zimbabwe beat Pakistan Highest Score in ODI: ఐసీసీ ఒన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ 2023లో జింబాబ్వే భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. హరారే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో అమెరికాను ఏకంగా 304 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్ఏ కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో ఓటమెరుగని జింబాబ్వే.. తాజాగా అమెరికాకు చుక్కలు చూపించింది.
జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి 408 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ సీన్ విలియమ్స్(174; 101 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్స్లు) భారీ సెంచరీ చేయగా.. ఓపెనర్ జోయ్లార్డ్ గుంబీ (78; 103 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీబాదాడు. సికిందర్ రాజా (48; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు), ర్యాన్ బర్ల్ (47; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపులు మెరిపించారు. జింబాబ్వే బ్యాటర్ల ధాటికి అమెరికా బౌలర్లు పోటాపడి మరీ పరుగులు సమర్పించుకున్నారు. అమెరికా బౌలర్లలో అభిషేక్ పరాద్కర్ మూడు వికెట్లు తీయగా.. జెస్సీ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Also Read
- Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
- Suryakumar Yadav: పాకిస్థాన్తో మ్యాచ్లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
- IND vs SL 2nd Test: పంత్, జురెల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ అంతంటే?
- Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
Also Read: ICC World Cup 2023: నింగి నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో దిగిన వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీ!
409 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 104 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే బౌలర్ల దాటికి 25.1 ఓవర్లకే చాపచుట్టేసింది. యూఎస్ఏ బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. దీంతో జింబాబ్వే 304 పరుగులతో రికార్డు విజయం అందుకుంది. తద్వారా వన్డేల్లో అత్యధిక తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించిన జట్టుగా భారత్ తర్వాతి స్థానంలో నిలిచింది.
వన్డే క్రికెట్లో జింబాబ్వే నమోదైన చేసిన అత్యధిక స్కోరు (408) ఇదే. వన్డే క్రికెట్లో 400కు పైగా పరుగులు చేసిన 7వ జట్టుగా జింబాబ్వే నిలిచింది. ఈ రికార్డు వన్డే అగ్ర జట్టు పాకిస్థాన్ కూడా అందుకోలేదు. క్రికెట్లో మొత్తం 953 మ్యాచ్లు ఆడిన పాకిస్థాన్.. ఇప్పటివరకు 400 పరుగుల మార్క్ కూడా అందుకోలేదు. గతంలో జింబాబ్వేపై పాకిస్థాన్ చేసిన 399 పరుగులే అత్యధిక స్కోరు. పాక్ చేసిన 399 పరుగుల రికార్డును జింబాబ్వే అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
Also Read: Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్గా న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!