Wasim Jaffer: టీమిండియా స్టార్ ఆటగాళ్లందరూ రంజీలు ఆడాల్సిందే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wasim Jaffer: న్యూజిలాండ్పై వన్డే సిరీస్ గెలిచిన నేపథ్యంలో మూడో వన్డే నుంచి కీలక ఆటగాళ్లను తప్పించాలని బీసీసీఐకి మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక సూచనలు చేశాడు. మూడో వన్డే నుంచి కోహ్లీ తప్పుకుని రంజీ ట్రోఫీ ఆడాలంటూ ఇప్పటికే రవిశాస్త్రి సహా పలువురు మాజీలు సూచించారు. అయితే కోహ్లీ మాత్రమే కాకుండా రోహిత్ శర్మ, సిరాజ్, షమీ కూడా ఇదే పని చేయాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్తో మూడో వన్డేలో గెలిచినా.. గెలవకపోయినా సమస్య లేదు కాబట్టి ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్ కోసం సన్నాహకాలు మెుదలుపెట్టాలని జాఫర్ అన్నాడు.
Read Also: Akshay Kumar: ఈసారి హిట్ కొట్టడం గ్యారెంటీ…
Also Read
- ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
- ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
అటు భారత స్టార్ ఆటగాళ్లు టెస్టు మ్యాచ్లు ఆడి చాలా రోజులైందని.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఇద్దరూ బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడినా అంతగా రాణించలేదని జాఫర్ చెప్పాడు. రోహిత్ శర్మ గతేడాది మార్చిలో టెస్టు ఆడాడని.. ఆ తర్వాత మళ్లీ టెస్టులు ఆడలేదన్నాడు. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో జరిగే మెుదటి టెస్టుకు సిద్ధంగా ఉండాలని జాఫర్ సూచించాడు. రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్ మంగళవారం మొదలవుతుందని.. భారత జట్టు కివీస్తో మూడో వన్డే కూడా అదే రోజు ఆడాల్సి ఉందన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ భారత్కు చాలా కీలకమని.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లాలంటే భారత్ ఈ సిరీస్ గెలిచి తీరాలని జాఫర్ అన్నాడు. అంతేకాదు టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా నిలవాలన్నా కూడా టీమిండియాకు ఈ సిరీస్ కీలకమేనని తెలిపాడు.
తాజావార్తలు
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
-
Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
-
Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?