Virat Kohli-India U19: మన ఆధిపత్యం కొనసాగుతోంది.. భారత్ అండర్-19 జట్టుకు కోహ్లీ విషెష్!
- 2026 అండర్-19 వరల్డ్కప్ భారత్ సొంతం
- భారత్ యువ జట్టుపై కోహ్లీ ప్రశంసలు
- మన ఆధిపత్యం కొనసాగుతోంది అంటూ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Praises India U19 Team: అండర్-19 వరల్డ్కప్లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో ఆరోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ ఏకపక్ష ఫైనల్లో భారత్ యువ జట్టు చూపిన ప్రదర్శన ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించిన ఇన్నింగ్స్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఈ అద్భుత విజయంపై భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. 2008లో అండర్-19 వరల్డ్కప్ గెలిచిన కెప్టెన్ కోహ్లీ ఈ విజయం ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు.
‘మరోసారి అండర్-19 వరల్డ్కప్ గెలిచిన భారత యువ జట్టుకు అభినందనలు. వయో కేటగిరీ క్రికెట్లోనే కాదు.. దాని తర్వాతి స్థాయిల్లోనూ మన ఆధిపత్యం కొనసాగుతోంది. అండర్-19 జట్టు, సపోర్ట్ స్టాఫ్కు శుభాకాంక్షలు’ అని విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత యువ క్రికెట్ వ్యవస్థ ఎంత బలంగా ఉందో ఈ విజయం మరోసారి రుజువు చేస్తోందని కింగ్ అభిప్రాయపడ్డారు. అండర్-19 స్థాయిలో భారత జట్టు సాధిస్తున్న వరుస విజయాలే భవిష్యత్తులో సీనియర్ టీమిండియా బలంగా నిలవడానికి పునాది అని కోహ్లీ చెప్పుకొచ్చారు. గతంలో కోహ్లీ కూడా అండర్-19 వరల్డ్కప్ గెలిచిన కెప్టెన్ కావడంతో.. యువ ఆటగాళ్ల విజయానికి కింగ్ స్పందన మరింత ప్రత్యేకంగా మారింది.
Also Read
- Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
- Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
- Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
- BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
Also Read: iPhone 17e Launch: డైనమిక్ ఐలాండ్, సరికొత్త చిప్.. అతి తక్కువ ధరలో ‘ఐఫోన్ 17ఈ’!
ఆరోసారి అండర్-19 వరల్డ్కప్ను గెలవడం భారత క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనత. ఈ విజయం యువ ఆటగాళ్ల ప్రతిభకు, కోచింగ్ స్టాఫ్ కృషికి నిదర్శనంగా నిలుస్తోంది. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్ల నుంచి వస్తున్న ప్రశంసలు యువ క్రికెటర్లకు మరింత ఉత్సాహాన్ని అందిస్తాయని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్లో భారత విజయంకు ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఈ టీనేజ్ సంచలనం కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 15 సిక్సులు, 15 ఫోర్లు ఉండటం విశేషం.
తాజావార్తలు
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!