Virat Kohli History: విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు.. వన్డేల్లో ఎప్పటికీ చెరగని ముద్ర!
- క్రికెట్ చరిత్రలో వన్డే ఫార్మాట్కు ప్రత్యేక స్థానం
- ఆటతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న దిగ్గజాలు
- విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ చరిత్రలో వన్డే ఫార్మాట్కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఫార్మాట్లో అనేక మంది దిగ్గజాలు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి.. తమ ఆటతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. వన్డేల్లో మొదటి డబుల్ సెంచరీ చేసి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నారు. అలానే అత్యధిక వన్డే మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ మొదటి స్థానంలో ఉన్నారు. భారత్ తరఫున మొత్తం 463 వన్డే మ్యాచ్లు ఆడి.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు నెలకొల్పారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు వెన్నుదన్నుగా నిలిచిన సచిన్.. వన్డేల్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడారు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమించాడు.
రెండో స్థానంలో భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఉన్నారు. ధోనీ భారత్ తరఫున 347 వన్డే మ్యాచ్లు ఆడారు. తన నాయకత్వంతో టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్ఠాత్మక ట్రోఫీలను అందించాడు. మూడో స్థానంలో ‘ద వాల్’గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ నిలిచారు. 340 వన్డే మ్యాచ్లు ఆడిన ద్రవిడ్.. తన నిబద్ధత, స్థిరత్వంతో భారత మిడిల్ ఆర్డర్కు వెన్నెముకగా నిలిచారు. ద్రవిడ్ ఆటలోని సహనం, క్రమశిక్షణ ఇప్పటికీ యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నాలుగో స్థానంలో మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఉండగా.. ఆయన భారత్ తరఫున 334 వన్డే మ్యాచ్లు ఆడారు. అజార్ కెప్టెన్సీ కాలంలో భారత్ అనేక కీలక విజయాలు సాధించింది.
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
ఐదో స్థానంలో ప్రస్తుత తరం దిగ్గజం విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు భారత్ తరఫున 309 వన్డే మ్యాచ్లు ఆడాడు. భారత్ తరఫున అత్యధిక వన్డే మ్యాచ్లు ఆడిన జాబితాలో కొనసాగుతున్న ఏకైక యాక్టివ్ ప్లేయర్ కోహ్లీనే. అద్భుతమైన ఫిట్నెస్, దూకుడైన ఆటతీరు, స్థిరమైన ప్రదర్శనలతో కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆరవ స్థానంలో భారత క్రికెట్కు కొత్త దిశ చూపించిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నారు. దాదా భారత్ తరఫున 308 వన్డే మ్యాచ్లు ఆడి.. యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతూ ఒక శక్తివంతమైన జట్టును నిర్మించారు. వడోదరలో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో కింగ్ బరిలోకి దిగడంతో దాదా రికార్డు బ్రేక్ అయింది. ఈ ఆటగాళ్లందరూ భారత వన్డే క్రికెట్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. వారి సేవలు, రికార్డులు భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరగని ముద్రగా నిలిచిపోతాయి.
భారత్ తరపున అత్యధిక వన్డే మ్యాచ్లు ఆడిన ప్లేయర్స్ లిస్ట్:
# 463 – సచిన్ టెండూల్కర్
# 347 – ఎంఎస్ ధోనీ
# 340 – రాహుల్ ద్రవిడ్
# 334 – మహ్మద్ అజారుద్దీన్
# 309 – విరాట్ కోహ్లీ
# 308 – సౌరవ్ గంగూలీ
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!