Usman Tariq Bowling: వీధుల్లో ఆడే పిల్లలు కూడా బౌలింగ్ చేస్తారు.. ఉస్మాన్ తారిక్పై సెహ్వాగ్ ఫైర్!
- యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో తారిక్ బౌలింగ్
- తారిక్ బౌలింగ్ యాక్షన్పై విమర్శలు
- వీధుల్లో ఆడే పిల్లలు కూడా బౌలింగ్ చేస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం.. అతడి బౌలింగ్ యాక్షన్. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సిరీస్లో తారిక్ బౌలింగ్ యాక్షన్పై విమర్శలు వచ్చాయి. ఆసీస్ టాప్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్ మైదానంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లోనూ మరోసారి అతడి బౌలింగ్ యాక్షన్ చర్చకు వచ్చింది. ఈసారి ఏకంగా అభిమానులే అతడిని టార్గెట్ చేశారు. ఇక తారిక్ బౌలింగ్ యాక్షన్పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి బౌలింగా.. అలా అయితే వీధుల్లో ఆడే చిన్న పిల్లలు కూడా బౌలింగ్ చేయగలరు అని ఉస్మాన్ తారిక్ను వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించారు. తారిక్ బంతి విసిరే ముందు బ్యాట్స్మన్ వైపు చూసి.. ఆ తరువాత చేతితో విడుదల చేస్తున్న విధానం ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. ఇలాంటి బౌలింగ్ యాక్షన్పై సమగ్ర విచారణ జరగాలని ఐసీసీకి సూచించారు. అంతర్జాతీయ క్రికెట్లో నిబంధనలు, ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని వీరూ అభిప్రాయపడ్డారు. సెహ్వాగ్ వ్యాఖ్యలతో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read
- AUS Vs BAN: బౌలర్ వేసిన బంతి తగలడంతో వాంతి చేసుకున్నాడు.. అయినా సిక్స్ కొట్టి గెలిపించాడు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘‘భారత క్రికెట్ నిధి’’.. మాజీ స్టార్ ప్రశంసలు..
- Aashirwad Sooryavanshi: మరో సూర్యవంశీ వస్తున్నాడండోయ్.. తొలి శతకాన్ని నమోదు చేసిన ఆశీర్వాద్..
- APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
Also Read: IND vs PAK: ఈసారి గెలుపు మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, విశ్లేషకులు ఈ అంశంపై మద్దతుగా నిలుస్తూ.. మరింత వేడెక్కిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో మరోసారి బౌలింగ్ యాక్షన్పై వివాదం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. యూఎస్ఏ మ్యాచ్లో ఉస్మాన్ తారిక్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి.. 27 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు పడగొట్టాడు. తారిక్ త్రో వేస్తున్నాడు అంటూ యూఎస్ఏ ఫాన్స్ మైదానంలో అరుస్తూ, ఇమిటేట్ చేస్తూ గోలగోల చేశారు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 190/9 పరుగులు చేయగా.. యూఎస్ఏ 159/8 పరుగులకే పరిమితమైంది. తారిక్ను టీమిండియాపై ఆడించాలన్నదే పాక్ అసలు ప్లాన్.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!