Usman Tariq Bowling: వీధుల్లో ఆడే పిల్లలు కూడా బౌలింగ్ చేస్తారు.. ఉస్మాన్ తారిక్పై సెహ్వాగ్ ఫైర్!
- యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో తారిక్ బౌలింగ్
- తారిక్ బౌలింగ్ యాక్షన్పై విమర్శలు
- వీధుల్లో ఆడే పిల్లలు కూడా బౌలింగ్ చేస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం.. అతడి బౌలింగ్ యాక్షన్. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సిరీస్లో తారిక్ బౌలింగ్ యాక్షన్పై విమర్శలు వచ్చాయి. ఆసీస్ టాప్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్ మైదానంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లోనూ మరోసారి అతడి బౌలింగ్ యాక్షన్ చర్చకు వచ్చింది. ఈసారి ఏకంగా అభిమానులే అతడిని టార్గెట్ చేశారు. ఇక తారిక్ బౌలింగ్ యాక్షన్పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి బౌలింగా.. అలా అయితే వీధుల్లో ఆడే చిన్న పిల్లలు కూడా బౌలింగ్ చేయగలరు అని ఉస్మాన్ తారిక్ను వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించారు. తారిక్ బంతి విసిరే ముందు బ్యాట్స్మన్ వైపు చూసి.. ఆ తరువాత చేతితో విడుదల చేస్తున్న విధానం ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. ఇలాంటి బౌలింగ్ యాక్షన్పై సమగ్ర విచారణ జరగాలని ఐసీసీకి సూచించారు. అంతర్జాతీయ క్రికెట్లో నిబంధనలు, ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని వీరూ అభిప్రాయపడ్డారు. సెహ్వాగ్ వ్యాఖ్యలతో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read
- SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
Also Read: IND vs PAK: ఈసారి గెలుపు మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, విశ్లేషకులు ఈ అంశంపై మద్దతుగా నిలుస్తూ.. మరింత వేడెక్కిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో మరోసారి బౌలింగ్ యాక్షన్పై వివాదం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. యూఎస్ఏ మ్యాచ్లో ఉస్మాన్ తారిక్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి.. 27 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు పడగొట్టాడు. తారిక్ త్రో వేస్తున్నాడు అంటూ యూఎస్ఏ ఫాన్స్ మైదానంలో అరుస్తూ, ఇమిటేట్ చేస్తూ గోలగోల చేశారు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 190/9 పరుగులు చేయగా.. యూఎస్ఏ 159/8 పరుగులకే పరిమితమైంది. తారిక్ను టీమిండియాపై ఆడించాలన్నదే పాక్ అసలు ప్లాన్.
తాజావార్తలు
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
-
SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
ట్రెండింగ్
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..