Usman Tariq Bowling: వీధుల్లో ఆడే పిల్లలు కూడా బౌలింగ్ చేస్తారు.. ఉస్మాన్ తారిక్పై సెహ్వాగ్ ఫైర్!
- యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో తారిక్ బౌలింగ్
- తారిక్ బౌలింగ్ యాక్షన్పై విమర్శలు
- వీధుల్లో ఆడే పిల్లలు కూడా బౌలింగ్ చేస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం.. అతడి బౌలింగ్ యాక్షన్. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సిరీస్లో తారిక్ బౌలింగ్ యాక్షన్పై విమర్శలు వచ్చాయి. ఆసీస్ టాప్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్ మైదానంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లోనూ మరోసారి అతడి బౌలింగ్ యాక్షన్ చర్చకు వచ్చింది. ఈసారి ఏకంగా అభిమానులే అతడిని టార్గెట్ చేశారు. ఇక తారిక్ బౌలింగ్ యాక్షన్పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి బౌలింగా.. అలా అయితే వీధుల్లో ఆడే చిన్న పిల్లలు కూడా బౌలింగ్ చేయగలరు అని ఉస్మాన్ తారిక్ను వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించారు. తారిక్ బంతి విసిరే ముందు బ్యాట్స్మన్ వైపు చూసి.. ఆ తరువాత చేతితో విడుదల చేస్తున్న విధానం ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. ఇలాంటి బౌలింగ్ యాక్షన్పై సమగ్ర విచారణ జరగాలని ఐసీసీకి సూచించారు. అంతర్జాతీయ క్రికెట్లో నిబంధనలు, ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని వీరూ అభిప్రాయపడ్డారు. సెహ్వాగ్ వ్యాఖ్యలతో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
Also Read: IND vs PAK: ఈసారి గెలుపు మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, విశ్లేషకులు ఈ అంశంపై మద్దతుగా నిలుస్తూ.. మరింత వేడెక్కిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో మరోసారి బౌలింగ్ యాక్షన్పై వివాదం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. యూఎస్ఏ మ్యాచ్లో ఉస్మాన్ తారిక్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి.. 27 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు పడగొట్టాడు. తారిక్ త్రో వేస్తున్నాడు అంటూ యూఎస్ఏ ఫాన్స్ మైదానంలో అరుస్తూ, ఇమిటేట్ చేస్తూ గోలగోల చేశారు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 190/9 పరుగులు చేయగా.. యూఎస్ఏ 159/8 పరుగులకే పరిమితమైంది. తారిక్ను టీమిండియాపై ఆడించాలన్నదే పాక్ అసలు ప్లాన్.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!