World Cup 2026 Schedule: ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది.. వేర్వేరు గ్రూప్ల్లో భారత్, పాకిస్థాన్!
- అండర్-19 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల
- వేర్వేరు గ్రూప్ల్లో భారత్, పాకిస్థాన్
- టోర్నమెంట్లో మొత్తం 16 జట్లు
- 23 రోజుల పాటు 41 మ్యాచ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
U19 World Cup 2026 Schedule: పురుషుల అండర్-19 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. ఐసీసీ తన వెబ్సైట్లో టోర్నమెంట్ షెడ్యూల్ను ప్రకటించింది. జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్న 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ఈసారి కూడా భారత్, పాకిస్థాన్ జట్లు వేర్వేరు గ్రూప్ల్లో ఉన్నాయి. దాంతో గ్రూప్ దశలో దాయాది దేశాలు తలపడవు. అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టు తన మొదటి మ్యాచ్లో అమెరికా (యూఎస్ఏ)ను ఢీకొట్టనుంది.
మెగా టోర్నమెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. 23 రోజుల పాటు 41 మ్యాచ్లు జరుగుతాయి. గ్రూప్-ఎలో భారత్తో పాటు బంగ్లాదేశ్, యూఎస్ఏ, న్యూజిలాండ్ టీమ్స్ ఉన్నాయి. గ్రూప్-బిలో జింబాబ్వే, పాకిస్థాన్, ఇంగ్లండ్, స్కాట్లాండ్ ఉండగా.. గ్రూప్-సిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక టీమ్స్ ఉన్నాయి. ఇక గ్రూప్-డిలో టంజానియా, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికాలు ఉన్నాయి. టోర్నీలో టంజానియా తొలిసారి ఆడుతోంది. జపాన్ 2020 తర్వాత తిరిగి ఆడుతోంది.
Also Read
- US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
Also Read: Shai Hope: చరిత్ర సృష్టించిన షాయ్ హోప్.. అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలిసారి!
జనవరి 15న అమెరికాతో, జనవరి 17న బంగ్లాదేశ్తో, జనవరి 24న న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. భారత్ ఆడే అన్ని మ్యాచ్లు బులవాయోలో జరుగుతాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో మ్యాచ్లు జరగనున్నాయి. గ్రూప్ దశలో ప్రతి గ్రూప్ నుంచి టాప్-3లో నిలిచిన జట్లు సూపర్-6కు అర్హత సాధిస్తాయి. రెండు సూపర్-6 గ్రూప్ల్లో టాప్-2లో నిలిచిన టీమ్స్ సెమీస్కు చేరతాయి. 4 టీమ్స్ సెమీ ఫైనల్స్ ఆడుతాయి. రెండు జట్లు ఫైనల్లో తలపడుతాయి. 2024లో జరిగిన ఫైనల్లో భారత్ను ఓడించిన ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఇక భారత్ అత్యధికంగా ఐదు టైటిళ్లు (2000, 2008, 2012, 2018, 2022) గెలిచింది.
తాజావార్తలు
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
-
Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
-
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్పింగ్ ప్రకటన
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!