Virat Kohli: కోహ్లీ స్థానానికి ఎసరుపెట్టిన సీనియర్ ప్లేయర్.. ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
This Senior Player Wants To Play At Virat Kohli 3rd Place For India: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. క్రికెట్ చరిత్రలో మరే ప్లేయర్ సాధించని ఎన్నో ఘనతల్ని తన పేరిట లిఖించుకున్నాడు. సింగిల్ హ్యాండెడ్గా భారత జట్టుని ఎన్నోసార్లు గెలిపించిన చరిత్ర అతనిది. అప్పుడప్పుడు ఫెయిల్ అయిన సందర్భాలున్నాయి కానీ, అతడ్ని రీప్లేస్ చేసే ఆటగాడు మాత్రం ప్రస్తుతం లేడు. కానీ.. ఓ సీనియర్ ప్లేయర్ మాత్రం అతనికి ప్లేస్కి ఎసరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కోహ్లీ టీమిండియా తరఫున ఆడే మూడో స్థానంలో తాను బాగా ఆడుతానని, అదే తనకు సరైన స్థానమని కుండబద్దలు కొట్టాడు. ఇంతకీ.. ఆ ఆటగాడు ఎవరని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. కేదార్ జాదవ్.
Bhaag Saale: కీరవాణి కొడుకు సినిమాలో ఎన్టీఆర్, చరణ్… థియేటర్స్ లో నవ్వులే
Also Read
- IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్గా వైభవ్..
- Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
దాదాపు మూడేళ్ల నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్న జాదవ్.. దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ సీజన్లో (2022-23) జాదవ్ అదరగొట్టాడు. 5 ఇన్నింగ్స్లలో 110.6 సగటుతో 553 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీ ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో కోలాపూర్ టస్కర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న జాదవ్.. తాజాగా ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా.. భారత జట్టులోకి తన రీఎంట్రీపై అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని, అందుకు తగ్గట్టు కష్టపడతున్నాని తెలిపాడు. తన ఆటతీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నానని, తాను భాగమైన ప్రతి టోర్నీలో మంచి ప్రదర్శన చేయడమే తన టార్గెట్ అని తెలిపాడు. ఆ తర్వాత సెలక్టర్లు వారి నిర్ణయం తీసుకుంటారన్నాడు.
Jabardast : ఆసియా-నూకరాజు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా?
ప్రస్తుతం తాను చాలా ఫిట్గానే ఉన్నానని చెప్పిన జాదవ్.. తనకు టాపార్డర్లో బ్యాటింగ్ చేయాలని ఉందని పేర్కొన్నాడు. తాను మహారాష్ట్ర తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్ చేస్తానని.. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో అదే తనకు సరైన స్థానమని, ఆ స్ధానంలో బ్యాటింగ్ వస్తే తాను స్వేఛ్చగా ఆడగలననని చెప్పుకొచ్చాడు. మరి, 38 ఏళ్ల జాదవ్ కోరిక తీరుతుందా? కాగా.. ప్రస్తుతం భారత జట్టులో విరాట్ కోహ్లి మూడో స్ధానంలో బ్యాటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..