Team India Squad: టీమిండియాలో పెను మార్పులు.. రాహుల్, పంత్, జడేజా భవిష్యత్తుపై అనిశ్చితి!
- టీమిండియాలో పెను మార్పులు
- రాహుల్, పంత్, జడేజా భవిష్యత్తుపై అనిశ్చితి
- యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు
Team India ODI Squad Changes for 2027 ODI World Cup: భారత వన్డే జట్టులో త్వరలోనే కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు భవిష్యత్తులో భారత జట్టు వన్డే ప్రణాళికల్లో ఉండకపోవచ్చని సమాచారం. 2027 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని.. బీసీసీఐ సెలెక్టర్లు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత వన్డే జట్టు ఎంపికపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందట.
2027 వరల్డ్ కప్ కోసం అత్యున్నత భారత జట్టును సిద్ధం చేయాలనే ఉద్దేశంతో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే తన చివరి వన్డే మ్యాచ్ ఆడేసి ఉండొచ్చని కూడా క్రికెట్ వర్గాలు అంటున్నాయి. జట్టు యాజమాన్యం ఇప్పుడు యువ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లపై దృష్టి పెట్టాలని భావిస్తోందట. అక్షర్ పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్స్ ఇప్పటికే నిరూపించుకున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026లో దూబే అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే.
Also Read
- India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
- RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
Also Read: AP Cabinet 2026: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపులకు ఆమోదం!
మరోవైపు 2027 వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. అక్కడి పిచ్లపై వేగం, బౌన్స్ కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వికెట్కీపర్ బ్యాట్స్మెన్లుగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. గాయాలు, ఫిట్నెస్, ఫామ్ లేని రిషబ్ పంత్ మెగా టోర్నీకి దాదాపుగా దూరమయినట్లే. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఆడుతారు. దాంతో కేఎల్ రాహుల్ కూడా అనుమానమే. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, టపార్డర్లో ఆడుతారు. శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, సంజు శాంసన్, ఇషాన్ కిషన్లు మిడిల్ ఆర్డర్లో ఉన్నారు. మొత్తానికి టీమిండియా వన్డే జట్టులో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువ ఆటగాళ్లతో కొత్త జట్టును తయారు చేసి 2027 వరల్డ్ కప్కు సిద్ధం కావాలనే లక్ష్యంతో బీసీసీఐ ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!