Medak Double Murder Case: ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన EMI.. మెదక్లో జంట హత్యల కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak Double Murder Case: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సురారం గ్రామంలో తీవ్ర కలకలం రేపిన జంట హత్యల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ప్రాణ స్నేహితులైన శ్రీధర్, ప్రభు (ప్రభాకర్) మధ్య ఉన్న చిన్నపాటి ఆర్థిక వివాదం, ఆపై కుటుంబ గొడవలే ఈ దారుణ హత్యలకు దారితీశాయి. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. శ్రీధర్, ప్రభు గతంలో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ప్రభు బంధువుల నుంచి శ్రీధర్ ఒక ఆటోను ఈఎంఐ (EMI) పద్ధతిలో తీసుకున్నాడు. అయితే, రెండు నెలల ఈఎంఐ బకాయిల విషయంలో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే గతంలో ప్రభు.. శ్రీధర్పై హత్యాయత్నానికి కూడా పాల్పడగా, అప్పట్లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ గొడవ ఇలా ఉండగానే, శ్రీధర్కు వరుసకు చెల్లెలు అయ్యే అమ్మాయిని ప్రభు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు, పగ మరింత తీవ్రరూపం దాల్చాయి.
మాట్లాడుకుందామని పిలిచి హత్య..
ఈ వివాదాలను పరిష్కరించుకోవడానికి నిన్న ఇద్దరూ ఒకచోట కలుసుకుని మాట్లాడుకుందామని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒకరికొకరు లొకేషన్లు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో చేగుంట మండలం అనంతసాగర్ వద్దకు శ్రీధర్ బైక్పై రాగానే.. అప్పటికే పథకం ప్రకారం అక్కడ వేచి ఉన్న ప్రభు, అతని స్నేహితులు ఆటోతో శ్రీధర్ బైక్ను బలంగా ఢీకొట్టారు. అనంతరం శ్రీధర్ను దారుణంగా హతమార్చి అక్కడి నుంచి పరారయ్యారు. కన్నకొడుకు శ్రీధర్ హత్యకు గురయ్యాడనే విషయం తెలవడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ప్రతీకారంతో రగిలిపోయారు. ప్రభుపై కక్షతో అర్ధరాత్రి వేళ అతని తండ్రి యాదగిరిని టార్గెట్ చేసి దారుణంగా హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు యాదగిరి మృతదేహాన్ని మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామ శివారులోని హల్దీవాగులో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, హల్దీవాగు నుంచి వెలికితీసిన యాదగిరి మృతదేహాన్ని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ జంట హత్యల నేపథ్యంలో సురారం గ్రామంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Also Read
- 11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
- India vs Ireland: టీమిండియాకు మరో బిగ్ షాక్.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లకు యువ ఆల్రౌండర్ దూరం!
- Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
- Layoffs: టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ కలకలం.. ఏకంగా 21,000 మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ..
తాజావార్తలు
-
Medak Double Murder Case: ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన EMI.. మెదక్లో జంట హత్యల కలకలం..
-
Bangladesh: 90 రోజుల్లో 100కు పైగా దాడులు.. బంగ్లాదేశ్లో మత చిచ్చుకు కారణమేంటి?
-
Chikungunya: గోమూత్రంతో చికున్గున్యాకు చెక్? ఐఐటీ రూర్కీ అధ్యయనం ఏం చెబుతోంది?
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
India vs Ireland: టీమిండియాకు మరో బిగ్ షాక్.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లకు యువ ఆల్రౌండర్ దూరం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!