T20 World Cup 2026: ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్.. అహ్మదాబాద్లో ఫైనల్..?
- ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 2026 టీ20 ప్రపంచకప్..
- ఈ ట్రోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్ లేదా కొలంబోలో జరిగే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరిగే ఛాన్స్ ఉంది. అయితే, పూర్తి షెడ్యూలు ఇంకా ఫిక్స్ కాలేదు. కాగా, ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్లు భారత్లోని 5 స్టేడియాలతో పాటు శ్రీలంకలోని రెండు గ్రౌండ్లలో జరగనున్నాయి. ఇక, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ తమ అన్నీ మ్యాచ్లను శ్రీలంకలో ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పోటీ పడనున్నాయి. అన్ని జట్లను నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. ఆ తర్వాత సూపర్ 8 దశ, సెమీఫైనల్స్, ఫైనల్ ఉంటాయి.
Read Also: Nagavamsi : ట్రెండ్ ఫాలో అవుతున్న నాగవంశీ
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్ లేదా కొలోంబోలో జరిగే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ జట్టు టీ20 వరల్డ్కప్ ఫైనల్కు అర్హత సాధిస్తే… తుది సమరం కొలంబోలో జరుగుతుంది. లీగ్ దశలోనే దాయాది జట్టు ఇంటికి వెళ్తే.. ఫైనల్ పోరు అహ్మదాబాద్ లో జరగనుంది. ఇక, డిఫెండింగ్ చాంపియన్ భారత్తో పాటు శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ జట్లు ఇప్పటికే టీ20 ప్రపంచకప్నకు అర్హత సాధించాయి.
Read Also: Viral: బిర్యానీలో బొద్దింక.. షాకైన బిర్యానీ లవర్.. ఎక్కడంటే…
ఇక, ఇందులో ఇటలీ జట్టు మొట్టమొదటిసారి ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఇక మిగిలిన ఐదు స్థానాల కోసం క్వాలిఫయింగ్ టోర్నీలు జరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి 2 జట్లు, తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి మరో 3 టీమ్స్ ఈ టోర్నీకి అర్హత సాధించే ఛాన్స్ ఉంది. 2024లో అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఇచ్చిన ఆతిథ్యంలో జరిగిన టీ20 ప్రపంచకప్ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
PM Modi: ఈ షో హౌస్పుల్.. బ్లాక్బస్టర్.. మెల్బోర్న్ సభపై మోడీ ప్రశంసలు
-
Ashwin: “అన్యాయం జరుగుతోంది.. ప్లేయర్స్ని ఒకేలా చూడటం లేదు”.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
-
China: “చైనా వృద్ధి 2 శాతం మాత్రమే” అన్న ఆర్థికవేత్త అనుమానాస్పద మృతి
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!