T20 World Cup 2026: ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్.. అహ్మదాబాద్లో ఫైనల్..?
- ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 2026 టీ20 ప్రపంచకప్..
- ఈ ట్రోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్ లేదా కొలంబోలో జరిగే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరిగే ఛాన్స్ ఉంది. అయితే, పూర్తి షెడ్యూలు ఇంకా ఫిక్స్ కాలేదు. కాగా, ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్లు భారత్లోని 5 స్టేడియాలతో పాటు శ్రీలంకలోని రెండు గ్రౌండ్లలో జరగనున్నాయి. ఇక, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ తమ అన్నీ మ్యాచ్లను శ్రీలంకలో ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పోటీ పడనున్నాయి. అన్ని జట్లను నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. ఆ తర్వాత సూపర్ 8 దశ, సెమీఫైనల్స్, ఫైనల్ ఉంటాయి.
Read Also: Nagavamsi : ట్రెండ్ ఫాలో అవుతున్న నాగవంశీ
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్ లేదా కొలోంబోలో జరిగే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ జట్టు టీ20 వరల్డ్కప్ ఫైనల్కు అర్హత సాధిస్తే… తుది సమరం కొలంబోలో జరుగుతుంది. లీగ్ దశలోనే దాయాది జట్టు ఇంటికి వెళ్తే.. ఫైనల్ పోరు అహ్మదాబాద్ లో జరగనుంది. ఇక, డిఫెండింగ్ చాంపియన్ భారత్తో పాటు శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ జట్లు ఇప్పటికే టీ20 ప్రపంచకప్నకు అర్హత సాధించాయి.
Read Also: Viral: బిర్యానీలో బొద్దింక.. షాకైన బిర్యానీ లవర్.. ఎక్కడంటే…
ఇక, ఇందులో ఇటలీ జట్టు మొట్టమొదటిసారి ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఇక మిగిలిన ఐదు స్థానాల కోసం క్వాలిఫయింగ్ టోర్నీలు జరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి 2 జట్లు, తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి మరో 3 టీమ్స్ ఈ టోర్నీకి అర్హత సాధించే ఛాన్స్ ఉంది. 2024లో అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఇచ్చిన ఆతిథ్యంలో జరిగిన టీ20 ప్రపంచకప్ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
-
Arshdeep Singh: అర్ష్దీప్ సింగ్కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..
-
China: జిన్పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక ‘అసలు’ మిస్టరీ ఇదేనా!
-
Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?
-
Vijay-Governor: గవర్నర్కు విజయ్ మరో షాకింగ్ లెటర్.. మ్యాజిక్ ఫిగర్ ఎంతేశారంటే..!