T20 World cup 2024 : తొలిసారి ఐసీసీ ఫైనల్స్ కు చేరిన దక్షిణాఫ్రికా..
- టీ20 క్రికెట్ ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది.
- తొలిసారి ఆ జట్టు ఫైనల్స్ చేరింది.
- ఈరోజు రాత్రి ఇంగ్లాడ్ - భారత్ మధ్య జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో విజేతతో దక్షిణాఫ్రికా ఫైనల్స్ ఆడనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World cup 2024 : టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా నేడు జరిగిన మొదటి సెమి ఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) , ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) తరౌబ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా కేవలం 11.5 ఓవర్లలో 56 పరుగులకు కుప్ప కూలింది. దింతో దక్షిణాఫ్రికా బౌల్లర్స్ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ ఏ పరిస్థితుల్లో కూడా ఎదురుకోలేకపోయింది. ఇక మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ లో ఒక్కరు మాత్రమే రెండు అంకెల స్కోరుని చేరుకున్నాడు. ఒమార్జై ఒక్కడే 10 పరుగులను చేసి అవుట్ అవ్వగా.. ఇన్నింగ్స్ లో ఎక్స్ట్రాలు 13 అత్యధిక స్కోర్ గా ఉంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ అంత కలిపి కేవలం 43 పరుగులు మాత్రమే చేసారు. ఈ ఇన్నింగ్స్ లో ముగ్గురు బ్యాట్స్మెన్స్ డక్ అవుట్ అయ్యారు. ఇక మరోవైపు దక్షిణాఫ్రికా బౌలర్లు విషయానికి వస్తే.. మార్కో జాన్సెన్, తబ్రైజ్ శంసిలు చెరో మూడు వికెట్లు.. కాగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే చెరో రెండు వికెట్లు తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ పతనానికి కారణం అయ్యారు.
Kalki 2898 AD – Devara : కల్కి లో దేవర.. ఉహించనేలేదుగా..
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఇక తక్కువ స్కోర్ టార్గెట్ చేసేందుకు బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా కేవలం 8.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులతో మొదటిసారి ఐసీసీ టోర్నమెంట్లో ఫైనల్ కు చేరుకుంది. మ్యాచ్లో కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు టికెట్లు తీసుకున్న మార్కో జాన్సన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లో డికాక్ కేవలం 5 పరుగులు చేసి వెనుతిరిగిగ మిగతా లాంచనాన్ని హెన్రిక్స్, దక్షిణాఫ్రికా కెప్టెన్ దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కమ్ పూర్తి చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌల్లర్స్ లో ఫరుకి ఒక వికెట్ సాధించాడు. టీ20 క్రికెట్ ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్ చేరింది. 2007లో మొదటి టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగ్గా.. ఆ సంవత్సరం భారత్ ఛాంపియన్గా నిలిచింది. ఇప్పటివరకు 8 సార్లు టీ20 ప్రపంచకప్ జరగ్గా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్స్ చేరుకోలేదు. 2024లో సెమీఫైనల్స్లో ఆప్ఘానిస్తాన్పై ఘన విజయం సాధించి ఫైనల్స్ చేరింది. ఈరోజు రాత్రి ఇంగ్లాడ్, భారత్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్స్ మ్యాచ్లో విజేతతో దక్షిణాఫ్రికా ఫైనల్స్ ఆడనుంది.
తాజావార్తలు
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..