IND vs PAK: టీమిండియా చేతిలో చిత్తు చిత్తుగా ఓటమి.. పాక్ జట్టులో భారీ మార్పులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: టీమిండియా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన పాకిస్తాన్ జట్టు తీవ్ర గందరగోళం పడిపోయిందట.. 61 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పెద్ద మార్పులు జరగనున్నాయి. బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది తదితర సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి, యంగ్ క్రికెటర్స్పై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
సీనియర్ క్రికెటర్ల కెరిరీపై ప్రశ్నలు..
2026 టీ20 ప్రపంచ కప్లో భారత్తో జరిగిన ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్లో ప్రకంపనలు సంభవిస్తున్నాయి.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సీనియర్ బ్యాట్స్మన్ బాబర్ ఆజం, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది తదుపరి సీనియర్ ఆటగాళ్లను మ్యాచ్లకు దూరం పెట్టే అవకాశం ఉంది. జట్టు యాజమాన్యం, సూపర్ 8 దశలో విజయ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోనుందట..
Also Read
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
- INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
- Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్గా..
- INDW Vs PAKW: పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన స్మృతి.. టీ20 వరల్డ్కప్లో అరుదైన రికార్డు..
PCB అధికారి అసంతృప్తి
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జట్టు ప్రదర్శన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశంతో జరిగిన మ్యాచ్ తర్వాత, కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం నుంచి ముందుగానే బయలుదేరి వెళ్లడం ద్వారా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బోర్డు పెద్ద మ్యాచ్లలో ఇలాంటి ప్రదర్శన అంగీకరించరాని సందేశాన్ని జట్టు మేనేజర్కు పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు.. హెడ్ కోచ్ మైక్ హెస్సన్ డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లకు తీవ్రంగా మందలించినట్టుగా సమాచారం.. జట్టు తన సామర్థ్యం మేరకు ప్రదర్శన ఇవ్వడం లేదని స్పష్టంగా చెప్పారట… ఆ రాత్రి సుదీర్ఘమైన జట్టు నిర్వహణ సమావేశం జరగగా.. ఇందులో మార్పులు చేయాలనే నిర్ణయం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది..
యువ ఆటగాళ్లకు అవకాశం
నమీబియాతో జరిగే మ్యాచ్ కోసం కొత్త ప్లేయింగ్ XIని రూపొందించడం, ఫఖర్ జమాన్ పునరాగమనం, యువ ఫాస్ట్ బౌలర్ల ప్రవేశం వంటి మార్పులు జరగవచ్చని భావిస్తున్నారు. నసీమ్ షా వంటి ఎంపికలను కూడా పరిశీలిస్తారు. రాబోయే టోర్నమెంట్ కోసం మిడిల్ ఆర్డర్లో కొత్త ఆటగాళ్లను ప్రయోగించడం లక్ష్యంగా పెట్టుకుందట బోర్డు… అయితే, పాకిస్తాన్ ఇప్పటికే USA మరియు నెదర్లాండ్స్లను ఓడించింది, కానీ భారత్పై ఘోర పరాజయాన్ని మూఠగట్టుకుంది.. దీంతో, నమీబియాతో మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. ఇక్కడ ఓడితే మాత్రం సూపర్ 8కు దాదాపు దూరమైనట్టే.. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 18న జరుగనుంది.
భయపెట్టిన ఆటగాళ్లు
భారత్తో మ్యాచ్లో షాహీన్ ఖాన్ రెండు ఓవర్లలో 31 పరుగులకు ఒక వికెట్ పడగొట్టగా, షాదాబ్ ఖాన్ ఒక ఓవర్లో 17 పరుగులు ఇచ్చాడు. బాబర్ ఆజం ఐదు పరుగులకే ఔటయ్యాడు. షాదాబ్ 14, షాహీన్ 23 పరుగులతో నాటౌట్గా నిలిచారు. భారతదేశంతో ఘోర పరాజయం తర్వాత ఈ మూడు అనుభవజ్ఞుల ఆటగాళ్లపై సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు పాక్ అభిమానులు..
తాజావార్తలు
-
Trump: ఇరాన్కు ఒక్క పైసా కూడా ఇవ్వం.. స్విట్జర్లాండ్ చర్చలు వాయిదాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
-
PhonePe: ఫోన్పే వాడితే రూ.100 కట్.. ఎలాగో తెలుసా?
-
Team India: వాళ్లు ఫ్యామిలీలతో గడపొద్దా..? మాజీ కెప్టెన్ ఆగ్రహం..
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?