IND vs PAK: టీమిండియా చేతిలో చిత్తు చిత్తుగా ఓటమి.. పాక్ జట్టులో భారీ మార్పులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: టీమిండియా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన పాకిస్తాన్ జట్టు తీవ్ర గందరగోళం పడిపోయిందట.. 61 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పెద్ద మార్పులు జరగనున్నాయి. బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది తదితర సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి, యంగ్ క్రికెటర్స్పై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
సీనియర్ క్రికెటర్ల కెరిరీపై ప్రశ్నలు..
2026 టీ20 ప్రపంచ కప్లో భారత్తో జరిగిన ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్లో ప్రకంపనలు సంభవిస్తున్నాయి.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సీనియర్ బ్యాట్స్మన్ బాబర్ ఆజం, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది తదుపరి సీనియర్ ఆటగాళ్లను మ్యాచ్లకు దూరం పెట్టే అవకాశం ఉంది. జట్టు యాజమాన్యం, సూపర్ 8 దశలో విజయ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోనుందట..
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
PCB అధికారి అసంతృప్తి
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జట్టు ప్రదర్శన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశంతో జరిగిన మ్యాచ్ తర్వాత, కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం నుంచి ముందుగానే బయలుదేరి వెళ్లడం ద్వారా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బోర్డు పెద్ద మ్యాచ్లలో ఇలాంటి ప్రదర్శన అంగీకరించరాని సందేశాన్ని జట్టు మేనేజర్కు పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు.. హెడ్ కోచ్ మైక్ హెస్సన్ డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లకు తీవ్రంగా మందలించినట్టుగా సమాచారం.. జట్టు తన సామర్థ్యం మేరకు ప్రదర్శన ఇవ్వడం లేదని స్పష్టంగా చెప్పారట… ఆ రాత్రి సుదీర్ఘమైన జట్టు నిర్వహణ సమావేశం జరగగా.. ఇందులో మార్పులు చేయాలనే నిర్ణయం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది..
యువ ఆటగాళ్లకు అవకాశం
నమీబియాతో జరిగే మ్యాచ్ కోసం కొత్త ప్లేయింగ్ XIని రూపొందించడం, ఫఖర్ జమాన్ పునరాగమనం, యువ ఫాస్ట్ బౌలర్ల ప్రవేశం వంటి మార్పులు జరగవచ్చని భావిస్తున్నారు. నసీమ్ షా వంటి ఎంపికలను కూడా పరిశీలిస్తారు. రాబోయే టోర్నమెంట్ కోసం మిడిల్ ఆర్డర్లో కొత్త ఆటగాళ్లను ప్రయోగించడం లక్ష్యంగా పెట్టుకుందట బోర్డు… అయితే, పాకిస్తాన్ ఇప్పటికే USA మరియు నెదర్లాండ్స్లను ఓడించింది, కానీ భారత్పై ఘోర పరాజయాన్ని మూఠగట్టుకుంది.. దీంతో, నమీబియాతో మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. ఇక్కడ ఓడితే మాత్రం సూపర్ 8కు దాదాపు దూరమైనట్టే.. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 18న జరుగనుంది.
భయపెట్టిన ఆటగాళ్లు
భారత్తో మ్యాచ్లో షాహీన్ ఖాన్ రెండు ఓవర్లలో 31 పరుగులకు ఒక వికెట్ పడగొట్టగా, షాదాబ్ ఖాన్ ఒక ఓవర్లో 17 పరుగులు ఇచ్చాడు. బాబర్ ఆజం ఐదు పరుగులకే ఔటయ్యాడు. షాదాబ్ 14, షాహీన్ 23 పరుగులతో నాటౌట్గా నిలిచారు. భారతదేశంతో ఘోర పరాజయం తర్వాత ఈ మూడు అనుభవజ్ఞుల ఆటగాళ్లపై సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు పాక్ అభిమానులు..
తాజావార్తలు
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
ట్రెండింగ్
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!