T20 World Cup Controversy: బంగ్లాదేశ్ను పాకిస్తానే తప్పుదారి పట్టించింది.. బీసీసీఐ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup Controversy: టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు చోటుచేసుకున్న వివాదంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. బంగ్లాదేశ్ జట్టు భారత్లో ఆడాలని భారతదేశం కోరుకుందని, పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, పాకిస్తాన్ ప్రభావంతోనే బంగ్లాదేశ్ తప్పుదారి పట్టిందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. 2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తన నాలుగు గ్రూప్ మ్యాచ్లను భారత్లో ఆడాల్సి ఉంది. వీటిలో మూడు మ్యాచ్లు కోల్కతాలో, ఒక మ్యాచ్ ముంబైలో జరగాల్సి ఉంది. అయితే, భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భారత్కు జట్టును పంపేందుకు నిరాకరించింది. మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేయగా, ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. బంగ్లాదేశ్ తన నిర్ణయంపై మొండిగా ఉండటంతో చివరకు ఐసిసి కఠిన చర్యలకు దిగింది.
స్కాట్లాండ్కు అవకాశం
పదే పదే విజ్ఞప్తులు చేసినప్పటికీ బంగ్లాదేశ్ స్పందించకపోవడంతో, ఐసీసీ బంగ్లాదేశ్ను టోర్నమెంట్ నుంచి తప్పించింది. వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును గ్రూప్ సీలో చేర్చింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు
ఈ అంశంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందిస్తూ, “మేం బంగ్లాదేశ్ ఆడాలని కోరుకున్నాం. పూర్తి భద్రత కల్పిస్తామని, ఎలాంటి సమస్యలు ఉండవని హామీ ఇచ్చాం. అయినా వారు భారత్లో ఆడబోమని తేల్చిచెప్పారు. చివరి నిమిషంలో షెడ్యూల్ మార్చడం సాధ్యం కాదు. అది వారి నిర్ణయం. అందుకే ఐసిసి స్కాట్లాండ్ను తీసుకువచ్చింది” అని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ పాత్రను రాజీవ్ శుక్లా తీవ్రంగా ప్రశ్నించారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ను రెచ్చగొట్టింది. అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటోంది. బంగ్లాదేశ్ను తప్పుదారి పట్టించడంలో పాకిస్తాన్ ప్రధాన పాత్ర పోషించింది. ఇది తప్పు అని విమర్శించారు.
బంగ్లాదేశ్ చరిత్రను ప్రస్తావించిన శుక్లా, “బంగ్లాదేశీయులపై పాకిస్తాన్ చేసిన దారుణాలు ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు వారిని సానుభూతితో మభ్యపెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఈ వివాదం మధ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ భారత్–పాకిస్తాన్ మ్యాచ్ను బహిష్కరిస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది. అయితే, ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభమై మార్చి 8న ముగియనుంది. 2024 టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!