Pakistan Cricket: T20 ప్రపంచ కప్లో ఘోర పరాజయాలు పాకిస్తాన్ క్రికెట్లో సంక్షోభానికి కారణమవుతున్నాయి. భారత్పై ఓడిపోవడమే కాకుండా, సెమీస్కు క్వాలిఫై అవ్వకపోవడంపై పాక్ మాజీలు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, టీమ్ సభ్యులపై విరుచుకుపడుతున్నారు. పాక్ క్రికెటర్ల పేలవమైన ఆటతీరుకు గానూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) భారీ జరిమానాను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కెప్టెన్ను తొలగించవచ్చని నివేదికలు చెబుతున్నాయి.