T20 World Cup controversy: భారత్లో టీ20 ఆడేది లేదన్న బంగ్లాదేశ్.. అంత ఈజీ కాదన్న బీసీసీఐ
- భారత్- బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత..
- భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడొద్దని సూచించిన బంగ్లా సర్కార్..
- బంగ్లాదేశ్ ఇండియాలోనే మ్యాచులు ఆడాలి.. వేదికలు మార్చడం అంత ఈజీ కాదు: బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup controversy: భారత్తో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ బోర్డు (BCB)కి కీలక సూచనలు జారీ చేసింది. 2026 టీ20 వరల్డ్ కప్లో బంగ్లా.. భారత్లో ఆడాల్సిన మ్యాచ్ల వేదికలను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని అభ్యర్థించింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి అధికారికంగా చెప్పాలని, టోర్నమెంట్లో బంగ్లా మ్యాచ్లకు ప్రత్యామ్నాయ వేదికగా శ్రీలంకను ఎంపిక చేయాలని తాత్కాలిక ప్రభుత్వం బీసీబీని ఆదేశించినట్లు నజ్రుల్ ఫేస్ బుక్ లోపోస్ట్ పెట్టారు.
Read Also: Dimple Hayathi : పూజలతో ఎవరూ స్టార్ అయిపోరు.. వేణు స్వామి పై డింపుల్ హయాతి షాకింగ్ కామెంట్స్!
Also Read
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
- INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
ఇక, బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమన్ తో కాంట్రాక్ట్ పొందినప్పటికీ భారత్లో ఐపీఎల్ ఆడలేకపోతే.. టీ20 ప్రపంచ కప్ ఆడటానికి తమ దేశ జాతీయ జట్టు భారత్కు ప్రయాణించడం సురక్షితం కాదని క్రీడా మంత్రిత్వ శాఖకు ఇంఛార్జ్ సలహాదారుగా ఆసిఫ్ స్పష్టం చేశారు. ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలని అధికారికంగా అభ్యర్థించాలని ఆదేశించామని నజ్రుల్ తన పోస్ట్లో వెల్లడించారు.
Read Also: Trump: వెనిజులా తర్వాత మీరే.. ఈ దేశాలకు ట్రంప్ బిగ్ వార్నింగ్..
అయితే, టోర్నీమెంట్ ప్రారంభానికి నెల రోజుల సమయం ఉండటంతో వేదికలను మార్చడం అసాధ్యమని బీసీసీఐ పేర్కొంది. ఒకరి ఇష్టానుసారం మీరు వేదికలను మార్చలేరని తెలిపింది. ప్రయాణపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.. బంగ్లాతో ఆడే ఇతర జట్ల నుంచి గురించి ఆలోచించన చేయండి.. వారి విమాన టిక్కెట్లు, హోటళ్లు బుక్ అయ్యాయి.. టోర్నీలో లీగ్ దశలో ప్రతిరోజు 3 మ్యాచ్లు ఉంటాయి. ఇందులో ఒకటి శ్రీలంకలో జరగనుంది.. బ్రాడ్కాస్టింగ్ విషయంలోనూ సమస్యలు వస్తాయి.. కాబట్టి, మ్యాచ్ల తరలింపు అనేది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనుకున్నంత ఈజీ కాదు అని బీసీసీఐ వెల్లడించింది.
Read Also: The Raja Saab: ‘సలార్’ మిస్ అయినా ‘రాజా సాబ్’తో కల నెరవేరింది!
కాగా, ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతుంది. గ్రూప్ స్టేజ్లో బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు మ్యాచ్లను భారత్లోనే షెడ్యూల్ చేసేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లాండ్, 17న వాంఖడేలో నేపాల్తో మ్యాచ్లను బంగ్లాదేశ్ ఆడాల్సి ఉంది. బంగ్లాలో హిందువులపై వరుస దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్లో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడొద్దని బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Padma Awards: 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేత.. మమ్ముట్టి, మాధవన్కు గౌరవం
-
Infosys Recruitment: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
-
Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
-
Pakistan: ఇస్లామిక్ ఐడెంటిటీ పక్కన పెట్టి.. భారత సంస్కృతి జపం చేస్తున్న పాక్.. ఎందుకో తెలుసా?
-
NIMS Recruitment : నిమ్స్లో 122 జాబ్స్.. డిగ్రీ ఉంటే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!