T20 World Cup controversy: భారత్లో టీ20 ఆడేది లేదన్న బంగ్లాదేశ్.. అంత ఈజీ కాదన్న బీసీసీఐ
- భారత్- బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత..
- భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడొద్దని సూచించిన బంగ్లా సర్కార్..
- బంగ్లాదేశ్ ఇండియాలోనే మ్యాచులు ఆడాలి.. వేదికలు మార్చడం అంత ఈజీ కాదు: బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup controversy: భారత్తో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ బోర్డు (BCB)కి కీలక సూచనలు జారీ చేసింది. 2026 టీ20 వరల్డ్ కప్లో బంగ్లా.. భారత్లో ఆడాల్సిన మ్యాచ్ల వేదికలను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని అభ్యర్థించింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి అధికారికంగా చెప్పాలని, టోర్నమెంట్లో బంగ్లా మ్యాచ్లకు ప్రత్యామ్నాయ వేదికగా శ్రీలంకను ఎంపిక చేయాలని తాత్కాలిక ప్రభుత్వం బీసీబీని ఆదేశించినట్లు నజ్రుల్ ఫేస్ బుక్ లోపోస్ట్ పెట్టారు.
Read Also: Dimple Hayathi : పూజలతో ఎవరూ స్టార్ అయిపోరు.. వేణు స్వామి పై డింపుల్ హయాతి షాకింగ్ కామెంట్స్!
Also Read
- Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
ఇక, బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమన్ తో కాంట్రాక్ట్ పొందినప్పటికీ భారత్లో ఐపీఎల్ ఆడలేకపోతే.. టీ20 ప్రపంచ కప్ ఆడటానికి తమ దేశ జాతీయ జట్టు భారత్కు ప్రయాణించడం సురక్షితం కాదని క్రీడా మంత్రిత్వ శాఖకు ఇంఛార్జ్ సలహాదారుగా ఆసిఫ్ స్పష్టం చేశారు. ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలని అధికారికంగా అభ్యర్థించాలని ఆదేశించామని నజ్రుల్ తన పోస్ట్లో వెల్లడించారు.
Read Also: Trump: వెనిజులా తర్వాత మీరే.. ఈ దేశాలకు ట్రంప్ బిగ్ వార్నింగ్..
అయితే, టోర్నీమెంట్ ప్రారంభానికి నెల రోజుల సమయం ఉండటంతో వేదికలను మార్చడం అసాధ్యమని బీసీసీఐ పేర్కొంది. ఒకరి ఇష్టానుసారం మీరు వేదికలను మార్చలేరని తెలిపింది. ప్రయాణపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.. బంగ్లాతో ఆడే ఇతర జట్ల నుంచి గురించి ఆలోచించన చేయండి.. వారి విమాన టిక్కెట్లు, హోటళ్లు బుక్ అయ్యాయి.. టోర్నీలో లీగ్ దశలో ప్రతిరోజు 3 మ్యాచ్లు ఉంటాయి. ఇందులో ఒకటి శ్రీలంకలో జరగనుంది.. బ్రాడ్కాస్టింగ్ విషయంలోనూ సమస్యలు వస్తాయి.. కాబట్టి, మ్యాచ్ల తరలింపు అనేది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనుకున్నంత ఈజీ కాదు అని బీసీసీఐ వెల్లడించింది.
Read Also: The Raja Saab: ‘సలార్’ మిస్ అయినా ‘రాజా సాబ్’తో కల నెరవేరింది!
కాగా, ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతుంది. గ్రూప్ స్టేజ్లో బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు మ్యాచ్లను భారత్లోనే షెడ్యూల్ చేసేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లాండ్, 17న వాంఖడేలో నేపాల్తో మ్యాచ్లను బంగ్లాదేశ్ ఆడాల్సి ఉంది. బంగ్లాలో హిందువులపై వరుస దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్లో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడొద్దని బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!