IND vs ENG : వర్షం పడి సెమీస్ మ్యాచ్ రద్దైతే..? టీమిండియా నేరుగా..
- టి20 ప్రపంచ కప్ సెమిస్ లో ఇంగ్లాండ్ తో తలబడనున్న టీమిండియా.
- జూన్ 27 గురువారం నాడు గయానలో మ్యాచ్.
- భారీ వర్షం పడుతుందంటున్న వాతావరణం శాఖ.
- అదే జరుగుతే నేరుగా ఫైనల్ లో టీమిండియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో టీమిండియా వరుస విజయాలతో సెమీఫైనల్ లో స్థానాన్ని సంపాదించింది. సెమీఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడనుంది. జూలై 27 గురువారం నాడు గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు మ్యాచులకు అనుకూలించట్లేదు. ఎప్పుడు వర్షం పడుతుందా.. ఎప్పుడు మ్యాచ్ నిలిచిపోతుందా.. అంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన పడిపోతున్నారు. ఇకపోతే సెమీఫైనల్స్ లో వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే ఏ టీం ఫైనల్ కు చేరుతుందన్న విషయం గురించి చూస్తే..
Hanuma Vihari: హనుమ విహారికి లోకేష్ మద్దతు.. తిరిగి ఏసీఏ తరపున ఆడాలని నిర్ణయం
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో ఇదివరకే చాలా మ్యాచ్లకు వర్షం అడ్డంకిగా మారింది. దాంతో ప్రపంచ కప్ లో కొన్ని మ్యాచ్లు రద్దు కావడంతో మరికొన్ని మ్యాచ్ లలో ఓవర్లు కుదించి మ్యాచ్ను ఆడించారు. ఇకపోతే టీమిండియా క్రికెట్ అభిమానుల్లో దృష్టి ఇప్పుడు అంతా గయానాలోని వాతావరణం పై పడింది. గురువారం నాడు జరిగే మ్యాచ్లో ఒకవేళ వర్షం పడితే.. టీమిండియా పరిస్థితి ఏంటో అంటూ కంగారు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారుల ప్రకారం గురువారంనాడు గయానాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 90 శాతం దగ్గరగా వర్షం పడే అవకాశం ఉందని., అందులో కూడా కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు సూచించారు. అయితే సెమి ఫైనల్ మ్యాచ్లకు ఐసీసీ రిజర్వ్ డేను ఇవ్వలేదు.
INDIA Bloc: సాయంత్రం ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతల భేటీ.. స్పీకర్ ఎన్నికపై చర్చ
ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే నాలుగు గంటల పది నిమిషాలు అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయంలో కూడా మ్యాచ్ జరగలేదంటే రద్దు చేసేస్తారు. ఒకవేళ ఇదే జరిగితే ఐసీసీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్ కు చేరుకున్న రెండు జట్లలో సూపర్ 8 స్టేజిలో ఎవరైతే మెరుగు ప్రదర్శన చేసి ఉంటారో.. ఆ జుట్టు నేరుగా ఫైనల్ గా చేరుకుంటుంది. దీంతో సూపర్ 8 దశలో ఇంగ్లాండ్ కంటే టీమిండియా మెరుగు ప్రదర్శన చేసింది. కాబట్టి ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయిన టీమిండియా నేరుగా ఫైనల్ లో చోటు సంపాదించుకుంటుంది. కాబట్టి భారత అభిమానులు వర్షం పడుతుందని బాధపడాల్సిన అవసరం లేదు. నిజానకి ఈ విషయం తెలిసిన చాలామంది ఖచ్చితంగా వర్షం కులవాలని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..