IND vs ENG : వర్షం పడి సెమీస్ మ్యాచ్ రద్దైతే..? టీమిండియా నేరుగా..
- టి20 ప్రపంచ కప్ సెమిస్ లో ఇంగ్లాండ్ తో తలబడనున్న టీమిండియా.
- జూన్ 27 గురువారం నాడు గయానలో మ్యాచ్.
- భారీ వర్షం పడుతుందంటున్న వాతావరణం శాఖ.
- అదే జరుగుతే నేరుగా ఫైనల్ లో టీమిండియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో టీమిండియా వరుస విజయాలతో సెమీఫైనల్ లో స్థానాన్ని సంపాదించింది. సెమీఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడనుంది. జూలై 27 గురువారం నాడు గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు మ్యాచులకు అనుకూలించట్లేదు. ఎప్పుడు వర్షం పడుతుందా.. ఎప్పుడు మ్యాచ్ నిలిచిపోతుందా.. అంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన పడిపోతున్నారు. ఇకపోతే సెమీఫైనల్స్ లో వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే ఏ టీం ఫైనల్ కు చేరుతుందన్న విషయం గురించి చూస్తే..
Hanuma Vihari: హనుమ విహారికి లోకేష్ మద్దతు.. తిరిగి ఏసీఏ తరపున ఆడాలని నిర్ణయం
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో ఇదివరకే చాలా మ్యాచ్లకు వర్షం అడ్డంకిగా మారింది. దాంతో ప్రపంచ కప్ లో కొన్ని మ్యాచ్లు రద్దు కావడంతో మరికొన్ని మ్యాచ్ లలో ఓవర్లు కుదించి మ్యాచ్ను ఆడించారు. ఇకపోతే టీమిండియా క్రికెట్ అభిమానుల్లో దృష్టి ఇప్పుడు అంతా గయానాలోని వాతావరణం పై పడింది. గురువారం నాడు జరిగే మ్యాచ్లో ఒకవేళ వర్షం పడితే.. టీమిండియా పరిస్థితి ఏంటో అంటూ కంగారు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారుల ప్రకారం గురువారంనాడు గయానాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 90 శాతం దగ్గరగా వర్షం పడే అవకాశం ఉందని., అందులో కూడా కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు సూచించారు. అయితే సెమి ఫైనల్ మ్యాచ్లకు ఐసీసీ రిజర్వ్ డేను ఇవ్వలేదు.
INDIA Bloc: సాయంత్రం ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతల భేటీ.. స్పీకర్ ఎన్నికపై చర్చ
ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే నాలుగు గంటల పది నిమిషాలు అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయంలో కూడా మ్యాచ్ జరగలేదంటే రద్దు చేసేస్తారు. ఒకవేళ ఇదే జరిగితే ఐసీసీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్ కు చేరుకున్న రెండు జట్లలో సూపర్ 8 స్టేజిలో ఎవరైతే మెరుగు ప్రదర్శన చేసి ఉంటారో.. ఆ జుట్టు నేరుగా ఫైనల్ గా చేరుకుంటుంది. దీంతో సూపర్ 8 దశలో ఇంగ్లాండ్ కంటే టీమిండియా మెరుగు ప్రదర్శన చేసింది. కాబట్టి ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయిన టీమిండియా నేరుగా ఫైనల్ లో చోటు సంపాదించుకుంటుంది. కాబట్టి భారత అభిమానులు వర్షం పడుతుందని బాధపడాల్సిన అవసరం లేదు. నిజానకి ఈ విషయం తెలిసిన చాలామంది ఖచ్చితంగా వర్షం కులవాలని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
-
Geetu Mohandas: “నేను రాసిందొకటి.. తీసిందొకటి”.. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?