T20 World Cup: బాయ్కాట్ నిర్ణయంపై పాక్ టీం యూటర్న్..?
- కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్ వివాదం..
- భారత్ మ్యా్చ్ బాయ్కాట్పై పాక్ యూటర్న్..?
- శ్రీలంక రిక్వెస్ట్ను పాకిస్తాన్ పరిగణించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ వివాదాలు ఇంకా ముగియడం లేదు. బంగ్లాదేశ్ భారత్లో భద్రతా కారణాలు చూపుతూ ఆడేందుకు నిరాకరించింది. దీంతో ఐసీసీ ఆ దేశాన్ని టోర్నీ నుంచి బహిష్కరించింది. మరోవైపు, బంగ్లాకు మద్దతుగా భారత్తో తాము మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే, టోర్నీ మొత్తాన్ని కాకుండా, కేవలం ఒక జట్టుతో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్తాన్ ఐసీసీ తీవ్ర చర్యలకు గురికావాల్సి వస్తుంది. దీంతో పాక్ క్రికెట్ బోర్డుకు తీవ్రమై ఆర్థిక నష్టమే కాకుండా, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు దాయాది జట్టు తన బాయ్కాట్ నిర్ణయంపై ‘‘యూటర్న్’’ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరిగే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని పీసీబీ మరోసారి సమీక్షించాలనుకుంటోంది. బాయ్కాట్ నిర్ణయాన్ని మార్చుకోవాలని శ్రీలంక, పాకిస్తాన్ను కోరింది. ఈ మ్యాచ్ జరగకపోతే శ్రీలంక క్రికెట్కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, టోర్నమెంట్ ఇమేజ్ దెబ్బతింటున్నది పేర్కొంది. ఈ మేరకు పీసీబీకి శ్రీలంక బోర్డు ఈమెయిల్ కూడా పంపించింది.
Also Read
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
- Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
దీంతో బాయ్కాట్ నిర్ణయంపై పాక్ క్రికెట్ బోర్డు తన ప్రభుత్వాన్ని సంప్రదించింది. పాక్ ప్రభుత్వానికి, శ్రీలంక ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. క్రికెట్ స్థాయిలో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. గతంలో పాక్ పర్యటనలో ఉన్న సమయంలోనే శ్రీలంక టీమ్పై దాడి కూడా జరిగింది. దీంతో శ్రీలంక అభ్యర్థన విస్మరించలేమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
“శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా నేరుగా మొహ్సిన్ నఖ్వీని సంప్రదించి, ఈ సమయంలో శ్రీలంకకు పాకిస్థాన్ మద్దతు అవసరమని గుర్తు చేశారు. ఎందుకంటే పాకిస్థాన్,భారతదేశం మ్యాచ్లు లేకపోతే, శ్రీలంక బోర్డు గేట్ మనీ, హాస్పిటాలిటీ రంగాలపై మొదలైన వాటి నుండి అదనపు ఆదాయాన్ని కోల్పోతుంది,” అని చెప్పినట్లు సమాచారం. పీసీబీ ఛైర్మన్ మోహ్సీన్ నఖ్వీ , పాక్ ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తారని చెప్పారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!