Nepal T20 World Cup Squad: ఐపీఎల్ స్టార్కు చోటు.. టీ20 వరల్డ్ కప్కు నేపాల్ జట్టు ఇదే!
- భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ 2026
- మెగా టోర్నీలో ఆడనున్న నేపాల్ జట్టు
- ఐపీఎల్ స్టార్కు నేపాల్ జట్టులో చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 వరల్డ్ కప్ 2026 జరగనుంది. 2025 ఆసియా కప్కు అర్హత సాధించడంలో విఫలమైన పసికూన నేపాల్.. మెగా టోర్నీలో ఆడనుంది. వరల్డ్ కప్ కోసం నేపాల్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. మెగా టోర్నీలో ఆల్రౌండర్ రోహిత్ పౌడెల్ నేపాల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మరో ఆల్రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ వైస్ కెప్టెన్గా నియమితులయ్యాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్టార్ సందీప్ లామిచానే నేపాల్ జట్టులో ఉన్నాడు.
25 ఏళ్ల సందీప్ లామిచానే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కి ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తరపున తొమ్మిది మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. నేపాలీ జట్టు విజయాల్లో సందీప్ కీలక పాత్ర పోషించనున్నాడు. గుల్షన్ ఝా, లలిత్ రాజ్బన్షి, కరణ్ కెసి, సోంపాల్ కామి వంటి స్టార్లు కూడా జట్టులో ఉన్నారు. టాప్ ఆర్డర్లో కుశాల్ భుర్టెల్ దూకుడు బ్యాటింగ్ నేపాల్కు కలిసిరానుంది. ఆసిఫ్ షేక్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు. మిడిల్ ఆర్డర్లో లోకేష్ బామ్ జట్టును ఆదుకోనున్నాడు. సందీప్ జోరా, ఆరిఫ్ షేక్లతో బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం కానుంది.
Also Read
- ICC ODI Rankings: టీమిండియా 'వన్డే' జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!
- Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
- Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ 'భూవీ' ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
- చైనాకు షాక్ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు.. Archery World Cup 2026లో స్వర్ణ పతకం కైవసం.!
ఫాస్ట్ బౌలింగ్ యూనిట్కు సోంపాల్ కామి, కరణ్ కెసి నాయకత్వం వహిస్తారు. ఇద్దరూ కొత్త బంతిని స్వింగ్ చేయగలరు. నందన్ యాదవ్, షేర్ మల్లా పేస్ బౌలింగ్ కోటాలో ఎంపికయ్యారు. 2024 టీ20 ప్రపంచకప్లో నేపాల్ నిరాశపరిచింది. నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిపోయి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. టీ20 వరల్డ్ కప్ 2026లో నేపాలీ జట్టు గ్రూప్ సిలో ఉంది. ఈ గ్రూప్లో ఇంగ్లాండ్, ఇటలీ, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం… నేపాలీ జట్టు తన నాలుగు లీగ్ మ్యాచ్లను ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుంది. ఫిబ్రవరి 8న ఇంగ్లాండ్తో నేపాల్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత వరుసగా ఇటలీ, వెస్టిండీస్, బంగ్లాదేశ్తో తలపడుతుంది.
నేపాల్ జట్టు:
రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఎయిరీ (వైస్ కెప్టెన్), సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (వికెట్ కీపర్), సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహ్మద్, కరణ్ యాడ్వ్ సి, సోంపాల్, సి. రాజబన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్.
నేపాల్ గ్రూప్ మ్యాచ్ షెడ్యూల్:
ఫిబ్రవరి 08, vs ఇంగ్లాండ్, ముంబై
ఫిబ్రవరి 12, vs ఇటలీ, ముంబై
ఫిబ్రవరి 15, vs వెస్టిండీస్, ముంబై
ఫిబ్రవరి 17, vs బంగ్లాదేశ్, ముంబై
తాజావార్తలు
-
HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
-
ICC ODI Rankings: టీమిండియా ‘వన్డే’ జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?