T20 World Cup 2026: వరల్డ్కప్ కలలు ఛిద్రం.. చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి!
- బంగ్లాదేశ్ వరల్డ్కప్ కలలు ఛిద్రం
- చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి
- బంగ్లాదేశ్ క్రికెటర్ల కెరీర్లకు పెద్ద దెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంపై మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం క్రికెట్ నుంచి రాజకీయాల దాకా వెళ్లిందని, ఆ భారాన్ని పూర్తిగా బంగ్లాదేశ్ ఆటగాళ్లే మోయాల్సి వస్తోందన్నారు. జీవితంలో ఒక్కసారే వచ్చే వరల్డ్కప్ వేదికపై ఆడే అవకాశాన్ని రాజకీయ నిర్ణయాలు హరించేశాయని తివారి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల వల్లే బంగ్లాదేశ్ వరల్డ్కప్ ఆడేందుకు రావడం లేదని, చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఏఎన్ఐతో మాట్లాడిన తివారి.. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెటర్ల కెరీర్లకు పెద్ద దెబ్బ అని అన్నారు.
‘ప్రతి ఆటగాడు తన దేశం తరపున వరల్డ్కప్ ఆడాలని కలలు కంటాడు. అలాంటి అవకాశం కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆటగాళ్ల చేతిలో ఏమీ లేదు. ఆడండి లేదా తప్పుకోండి అని ఐసీసీ స్పష్టంగా చెప్పింది. ఐసీసీ చాలా శక్తివంతమైన సంస్థ. కానీ ఇక్కడ బీసీబీ నిర్ణయం ఏమీ లేదు. బయట నుంచి చూస్తే ఇది పూర్తిగా స్పోర్ట్స్ మినిస్ట్రీ నిర్ణయమే అనిపిస్తోంది. క్రీడల్లో రాజకీయాలు జోక్యం చేసుకుంటే ఇలానే జరుగుతుంది. రాజకీయాల కారణంగా ఒక టెస్ట్ ఆడే దేశం వరల్డ్కప్కు రాకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇది చాలా దురదృష్టకరం’ అని మనోజ్ తివారి అన్నారు.
Also Read
- Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
టీ20 వరల్డ్కప్ టోర్నీ కోసం భారత్కు తమ జట్టు రావడం లేదని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ మరోసారి స్పష్టం చేశారు. భద్రతా కారణాలతో శ్రీలంకకు మ్యాచ్లు మార్చాలని బంగ్లాదేశ్ కోరినా.. భారత్లో ఎలాంటి భద్రతా ముప్పు లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. వేదికలు మార్చడం కుదరదని.. ఆడతారా? లేదా వదిలేస్తారా? తేల్చుకోండని.. టోర్నీ యథావిధిగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. టీ20 వరల్డ్కప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని బీసీబీ కూడా అంగీకరించింది. బోర్డు అధికారులు, సీనియర్ ఆటగాళ్లు, తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాల అనంతరం భద్రతా ఆందోళనలే తమను కఠిన నిర్ణయానికి కారణమని బీసీబీ వెల్లడించింది. ఆటగాళ్లకు ఇందులో ఎలాంటి ప్రమేయం లేదని కూడా పేర్కొంది. తొలి ఐసీసీ టైటిల్ కోసం ఎదురు చూస్తున్న బంగ్లాదేశ్కు.. ఈ వరల్డ్కప్ మిస్ కావడం తీవ్రంగా నష్టం చేకూర్చే అంశంగా మారనుంది.
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!