T20 World Cup 2026: వరల్డ్కప్ కలలు ఛిద్రం.. చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి!
- బంగ్లాదేశ్ వరల్డ్కప్ కలలు ఛిద్రం
- చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి
- బంగ్లాదేశ్ క్రికెటర్ల కెరీర్లకు పెద్ద దెబ్బ
భారత్లో జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంపై మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం క్రికెట్ నుంచి రాజకీయాల దాకా వెళ్లిందని, ఆ భారాన్ని పూర్తిగా బంగ్లాదేశ్ ఆటగాళ్లే మోయాల్సి వస్తోందన్నారు. జీవితంలో ఒక్కసారే వచ్చే వరల్డ్కప్ వేదికపై ఆడే అవకాశాన్ని రాజకీయ నిర్ణయాలు హరించేశాయని తివారి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల వల్లే బంగ్లాదేశ్ వరల్డ్కప్ ఆడేందుకు రావడం లేదని, చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఏఎన్ఐతో మాట్లాడిన తివారి.. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెటర్ల కెరీర్లకు పెద్ద దెబ్బ అని అన్నారు.
‘ప్రతి ఆటగాడు తన దేశం తరపున వరల్డ్కప్ ఆడాలని కలలు కంటాడు. అలాంటి అవకాశం కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆటగాళ్ల చేతిలో ఏమీ లేదు. ఆడండి లేదా తప్పుకోండి అని ఐసీసీ స్పష్టంగా చెప్పింది. ఐసీసీ చాలా శక్తివంతమైన సంస్థ. కానీ ఇక్కడ బీసీబీ నిర్ణయం ఏమీ లేదు. బయట నుంచి చూస్తే ఇది పూర్తిగా స్పోర్ట్స్ మినిస్ట్రీ నిర్ణయమే అనిపిస్తోంది. క్రీడల్లో రాజకీయాలు జోక్యం చేసుకుంటే ఇలానే జరుగుతుంది. రాజకీయాల కారణంగా ఒక టెస్ట్ ఆడే దేశం వరల్డ్కప్కు రాకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇది చాలా దురదృష్టకరం’ అని మనోజ్ తివారి అన్నారు.
Also Read
- Jofra Archer: అద్భుతం.. విజయ్ గెలుపును ముందే ఊహించి ట్వీట్ చేసిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్..
- Mumbai Indians: ఐపీఎల్లో వరుస ఓటములు.. అయినా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్...
- BCCI: ఐపీఎల్ ఆటగాళ్ల 'గర్ల్ఫ్రెండ్ కల్చర్'పై బీసీసీఐ సీరియస్.. హార్దిక్, యశస్వి, ఇషాన్, అర్ష్దీప్లకు బిగ్ షాక్!
- PSL 2026 Final: తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర.. కెప్టెన్గా తొలి పీఎస్ఎల్ ట్రోఫీ అందుకున్న బాబర్ ఆజం
టీ20 వరల్డ్కప్ టోర్నీ కోసం భారత్కు తమ జట్టు రావడం లేదని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ మరోసారి స్పష్టం చేశారు. భద్రతా కారణాలతో శ్రీలంకకు మ్యాచ్లు మార్చాలని బంగ్లాదేశ్ కోరినా.. భారత్లో ఎలాంటి భద్రతా ముప్పు లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. వేదికలు మార్చడం కుదరదని.. ఆడతారా? లేదా వదిలేస్తారా? తేల్చుకోండని.. టోర్నీ యథావిధిగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. టీ20 వరల్డ్కప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని బీసీబీ కూడా అంగీకరించింది. బోర్డు అధికారులు, సీనియర్ ఆటగాళ్లు, తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాల అనంతరం భద్రతా ఆందోళనలే తమను కఠిన నిర్ణయానికి కారణమని బీసీబీ వెల్లడించింది. ఆటగాళ్లకు ఇందులో ఎలాంటి ప్రమేయం లేదని కూడా పేర్కొంది. తొలి ఐసీసీ టైటిల్ కోసం ఎదురు చూస్తున్న బంగ్లాదేశ్కు.. ఈ వరల్డ్కప్ మిస్ కావడం తీవ్రంగా నష్టం చేకూర్చే అంశంగా మారనుంది.
తాజావార్తలు
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. భవానీపూర్లో ఘోర పరాజయం
-
Sunetra Pawar: బారామతి చరిత్రలో సరికొత్త అధ్యాయం.. భర్త మెజార్టీని క్రాస్ చేసిన సునేత్రా పవార్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!