INDvsAUS Test Series: అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడట్లేదు..సీక్రెట్ బయటపెట్టిన స్మిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిబ్రవరి 9న భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. టీమిండియాతో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది కంగారూ జట్టు. అయితే, ప్రతి టెస్టు సిరీస్ ముందు ఆతిథ్య మైదానాల్లో వార్మప్ మ్యాచ్లు ఆడటం ఆనవాయితీ. కానీ ఈ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆసీస్ ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడట్లేదు. నేరుగా సిరీస్లో భారత్ను ఢీకొననుంది. పిచ్లలో వ్యత్యాసం ఉంటుందని భావించి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడకూడదని ఆస్ట్రేలియా నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మద్దతు పలికాడు. వార్మప్ మ్యాచ్లు ఆడకపోవడమే బెటర్ అని చెప్పాడు.
Poliece Car Stolen: పోలీసుల కారునే దొంగలించాడు.. క్లైమాక్స్ మాత్రం సూపర్ బాసు
Also Read
- ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
- ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
“ఇంతకుముందు ఇక్కడ మేము ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాం. అసలు ఆ మ్యాచ్ల్లో ఆడాల్సిన అవసరం లేదు. మేము మా నెట్ ప్రాక్టీస్లో వీలైనంత ఎక్కువగా స్పిన్నర్లను ఎదుర్కోవాలి. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా సరైన నిర్ణయం తీసుకున్నామని నేను భావిస్తున్నాను” అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. స్మిత్ కంటే ముందు ఆసీస్ మరో బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా కూడా ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు.
Air India Urination Case: కో పాసింజర్పై మూత్ర విసర్జన కేసులో శంకర్ మిశ్రాకు బెయిల్
కాగా, ఈ సిరీస్కు ముందు టీమిండియా ప్లేయర్ల కోసం బీసీసీఐ ప్రాక్టీస్ సెషన్లను ఏర్పాటు చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు ముందు భారత్కు ఇదే చివరి సిరీస్ కావడం వల్ల ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని భావిస్తోన్న బీసీసీఐ.. టెస్టు సిరీస్కు ముందు నాగ్పూర్లో టీమ్ఇండియాకు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ను నిర్వహించనుంది. అయితే, తొలి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చే విదర్భ క్రికెట్ అసోసియేసన్ (వీసీఏ) స్టేడియంలో రెండు సెషన్స్ మాత్రమే జరుగుతాయి. మిగతా మూడు సెషన్స్ని పాత వీసీఏ స్టేడియంలో నిర్వహించనున్నారు. “సిరీస్కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు టెస్టు ఆటగాళ్లు నాగ్పూర్లో కలుస్తారు. అక్కడ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో వారికి క్యాంపు ఉంటుంది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ద్రవిడ్ జట్టుతో కలుస్తాడు. ఇది ఫిట్నెస్ క్యాంప్. కానీ, టెస్టు సిరీస్ ఆడటానికి ముందు ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేయడానికి ఇది మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది”అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
తాజావార్తలు
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?