ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికాలో పరిస్థితులు అంతబాగా లేవు. ఆ కారణంగానే అక్కడ దక్షిణాఫ్రికా , నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ వాయిదా పడింది. ఈ క్రమంలో వచ్చే నెలలో అక్కడికి వెళ్లనున్న భారత పర్యటన పై ప్రశ్నలు వచ్చాయి. టీం ఇండియాను బీసీసీఐ దక్షిణాఫ్రికాకు పంపాలంటే మమల్ని సంప్రదించాలి అని భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అందుకు ఒప్పుకున్న బీసీసీఐ జట్టును దక్షిణాఫ్రికా పంపాలనే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటె బీసీసీఐని దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. తాజాగా భారత జట్టు పర్యటన పై విదేశాంగ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ… డిసెంబర్లో ప్రారంభమయ్యే సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దక్షిణాఫ్రికాకు భారత క్రికెట్ జట్టు వచ్చినపుడు. వారికి పూర్తి బయో సురక్షిత వాతావరణాన్ని అందిస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే తమ ప్రభుత్వంపై విశ్వాసం చూపి ప్రస్తుతం ఇండియా ఏ, దక్షిణాఫ్రికా ఏ మధ్య జరుగుతున్న నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను వాయిదా వేయకుండా కొనసాగించడానికి అనుమతించినందుకు బీసీసీఐని ఆ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.