IND vs PAK: భారత్పై పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలి.. బీసీసీఐ, పీసీబీ ఏం చేయలేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoaib Akhtar Requests Pakistan Team To Take Revenge On India In ODI World Cup: ఆసియా కప్ నిర్వహణ వేదిక అంశంపై కొంతకాలం నుంచి తీవ్ర దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే! పాకిస్తాన్లో ఆసియా కప్ నిర్వహిస్తే తాము అక్కడ అడుగు పెట్టబోమని జైషా పేర్కొంటే.. తాము కూడా వరల్డ్కప్ ఆడేందుకు భారత్ గడ్డపై కాలు మోపమంటూ పాక్ బోర్డు సహా మాజీలు తిరుగు సమాధానాలిచ్చారు. అయితే.. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాత్రం ఈ అంశంపై భిన్నంగా స్పందించాడు. ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు మద్దతుగా నిలిచాడు. ‘‘ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. అయితే.. ఇవన్నీ కేవలం వట్టి మాటలు. బీసీసీఐ గానీ, పీసీబీ గానీ ఈ విషయంలో ఏమీ చేయలేవు. భారత ప్రభుత్వాన్ని సంప్రదించకుండా బీసీసీఐ.. పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి లేకుండా పీసీబీ.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేవు. కాబట్టి.. భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్ల విషయంలో మాజీ క్రికెటర్లు ప్రతికూలంగా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ అక్తర్ పేర్కొన్నాడు. ఒకవేళ భారత ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తే.. పాకిస్తాన్లో టీమిండియా పర్యటించడానికి బీసీసీఐ తప్పకుండా అనుమతినిస్తుందని అభిప్రాయపడ్డాడు.
VNRTrio: భీష్మ కాంబో రిపీట్.. ప్రాజెక్ట్ ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్
Also Read
- IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
- IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
- Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. 'సూరీడు' కమ్బ్యాక్ అవుతాడా?
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
ఇదే సమయంలో.. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడతే చూడాలని ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ‘‘వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఇండియా – పాకిస్తాన్ తలపడాలంతే. ఆ ఫైనల్ మ్యాచ్ ముంబైలోనా, అహ్మదాబాద్లోనా అనే అంశంతో నాకు సంబంధం లేదు. ఏదేమైనా.. టైటిల్ పోరు ఈ రెండు దేశాల మధ్యే జరగాలి’’ అని బలంగా కోరుకుంటున్నాడు. అంతేకాదు.. 2011 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి.. ప్రతీకారం తీర్చుకోవాలని బాబర్ ఆజం బృందాన్ని కోరాడు. కాగా.. 1983 వన్డే వరల్డ్కప్ ఈవెంట్లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ తొలిసారి వన్డే వరల్డ్కప్ సాధించింది. ఆ తర్వాత స్వదేశంలో 2011లో జరిగిన టోర్నీలో.. ధోని కెప్టెన్సీలో మరోసారి ట్రోఫీని ముద్దాడింది. అప్పటి నుంచి భారత్ ప్రపంచకప్ విజేతగా నిలవలేకపోయింది. మరోవైపు.. 1992లో ట్రోఫీ గెలిచిన పాకిస్తాన్కు ఇప్పటికీ ఆ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. దీంతో.. ఈసారి జరగబోయే వరల్డ్కప్లో విజయం సాధించి, టైటిల్ నెగ్గాలని భారత్, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరి, ఈసారి ఎవరు ట్రోఫీని ముద్దాడుతారో చూడాలి.
India: గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్లో అట్టడగున భారత్.. ఉక్రెయిన్ కంటే దిగువనే.. ఎందుకిలా?
తాజావార్తలు
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్లోనే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేయండి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..