IND vs PAK: భారత్పై పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలి.. బీసీసీఐ, పీసీబీ ఏం చేయలేవు
Shoaib Akhtar Requests Pakistan Team To Take Revenge On India In ODI World Cup: ఆసియా కప్ నిర్వహణ వేదిక అంశంపై కొంతకాలం నుంచి తీవ్ర దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే! పాకిస్తాన్లో ఆసియా కప్ నిర్వహిస్తే తాము అక్కడ అడుగు పెట్టబోమని జైషా పేర్కొంటే.. తాము కూడా వరల్డ్కప్ ఆడేందుకు భారత్ గడ్డపై కాలు మోపమంటూ పాక్ బోర్డు సహా మాజీలు తిరుగు సమాధానాలిచ్చారు. అయితే.. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాత్రం ఈ అంశంపై భిన్నంగా స్పందించాడు. ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు మద్దతుగా నిలిచాడు. ‘‘ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. అయితే.. ఇవన్నీ కేవలం వట్టి మాటలు. బీసీసీఐ గానీ, పీసీబీ గానీ ఈ విషయంలో ఏమీ చేయలేవు. భారత ప్రభుత్వాన్ని సంప్రదించకుండా బీసీసీఐ.. పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి లేకుండా పీసీబీ.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేవు. కాబట్టి.. భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్ల విషయంలో మాజీ క్రికెటర్లు ప్రతికూలంగా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ అక్తర్ పేర్కొన్నాడు. ఒకవేళ భారత ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తే.. పాకిస్తాన్లో టీమిండియా పర్యటించడానికి బీసీసీఐ తప్పకుండా అనుమతినిస్తుందని అభిప్రాయపడ్డాడు.
VNRTrio: భీష్మ కాంబో రిపీట్.. ప్రాజెక్ట్ ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
ఇదే సమయంలో.. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడతే చూడాలని ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ‘‘వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఇండియా – పాకిస్తాన్ తలపడాలంతే. ఆ ఫైనల్ మ్యాచ్ ముంబైలోనా, అహ్మదాబాద్లోనా అనే అంశంతో నాకు సంబంధం లేదు. ఏదేమైనా.. టైటిల్ పోరు ఈ రెండు దేశాల మధ్యే జరగాలి’’ అని బలంగా కోరుకుంటున్నాడు. అంతేకాదు.. 2011 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి.. ప్రతీకారం తీర్చుకోవాలని బాబర్ ఆజం బృందాన్ని కోరాడు. కాగా.. 1983 వన్డే వరల్డ్కప్ ఈవెంట్లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ తొలిసారి వన్డే వరల్డ్కప్ సాధించింది. ఆ తర్వాత స్వదేశంలో 2011లో జరిగిన టోర్నీలో.. ధోని కెప్టెన్సీలో మరోసారి ట్రోఫీని ముద్దాడింది. అప్పటి నుంచి భారత్ ప్రపంచకప్ విజేతగా నిలవలేకపోయింది. మరోవైపు.. 1992లో ట్రోఫీ గెలిచిన పాకిస్తాన్కు ఇప్పటికీ ఆ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. దీంతో.. ఈసారి జరగబోయే వరల్డ్కప్లో విజయం సాధించి, టైటిల్ నెగ్గాలని భారత్, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరి, ఈసారి ఎవరు ట్రోఫీని ముద్దాడుతారో చూడాలి.
India: గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్లో అట్టడగున భారత్.. ఉక్రెయిన్ కంటే దిగువనే.. ఎందుకిలా?
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!