IND vs PAK: భారత్పై పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలి.. బీసీసీఐ, పీసీబీ ఏం చేయలేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoaib Akhtar Requests Pakistan Team To Take Revenge On India In ODI World Cup: ఆసియా కప్ నిర్వహణ వేదిక అంశంపై కొంతకాలం నుంచి తీవ్ర దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే! పాకిస్తాన్లో ఆసియా కప్ నిర్వహిస్తే తాము అక్కడ అడుగు పెట్టబోమని జైషా పేర్కొంటే.. తాము కూడా వరల్డ్కప్ ఆడేందుకు భారత్ గడ్డపై కాలు మోపమంటూ పాక్ బోర్డు సహా మాజీలు తిరుగు సమాధానాలిచ్చారు. అయితే.. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాత్రం ఈ అంశంపై భిన్నంగా స్పందించాడు. ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు మద్దతుగా నిలిచాడు. ‘‘ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. అయితే.. ఇవన్నీ కేవలం వట్టి మాటలు. బీసీసీఐ గానీ, పీసీబీ గానీ ఈ విషయంలో ఏమీ చేయలేవు. భారత ప్రభుత్వాన్ని సంప్రదించకుండా బీసీసీఐ.. పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి లేకుండా పీసీబీ.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేవు. కాబట్టి.. భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్ల విషయంలో మాజీ క్రికెటర్లు ప్రతికూలంగా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ అక్తర్ పేర్కొన్నాడు. ఒకవేళ భారత ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తే.. పాకిస్తాన్లో టీమిండియా పర్యటించడానికి బీసీసీఐ తప్పకుండా అనుమతినిస్తుందని అభిప్రాయపడ్డాడు.
VNRTrio: భీష్మ కాంబో రిపీట్.. ప్రాజెక్ట్ ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
ఇదే సమయంలో.. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడతే చూడాలని ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ‘‘వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఇండియా – పాకిస్తాన్ తలపడాలంతే. ఆ ఫైనల్ మ్యాచ్ ముంబైలోనా, అహ్మదాబాద్లోనా అనే అంశంతో నాకు సంబంధం లేదు. ఏదేమైనా.. టైటిల్ పోరు ఈ రెండు దేశాల మధ్యే జరగాలి’’ అని బలంగా కోరుకుంటున్నాడు. అంతేకాదు.. 2011 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి.. ప్రతీకారం తీర్చుకోవాలని బాబర్ ఆజం బృందాన్ని కోరాడు. కాగా.. 1983 వన్డే వరల్డ్కప్ ఈవెంట్లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ తొలిసారి వన్డే వరల్డ్కప్ సాధించింది. ఆ తర్వాత స్వదేశంలో 2011లో జరిగిన టోర్నీలో.. ధోని కెప్టెన్సీలో మరోసారి ట్రోఫీని ముద్దాడింది. అప్పటి నుంచి భారత్ ప్రపంచకప్ విజేతగా నిలవలేకపోయింది. మరోవైపు.. 1992లో ట్రోఫీ గెలిచిన పాకిస్తాన్కు ఇప్పటికీ ఆ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. దీంతో.. ఈసారి జరగబోయే వరల్డ్కప్లో విజయం సాధించి, టైటిల్ నెగ్గాలని భారత్, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరి, ఈసారి ఎవరు ట్రోఫీని ముద్దాడుతారో చూడాలి.
India: గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్లో అట్టడగున భారత్.. ఉక్రెయిన్ కంటే దిగువనే.. ఎందుకిలా?
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!