Sania Mirza: టెన్నిస్ రాకెట్ పట్టని వారు కూడా మాట్లాడేవారు.. ఒక్కోసారి జాలి కలిగేది!
- బెంగళూరు టెక్ సమ్మిట్ 2025లో సానియా మీర్జా
- రిచా ఘోష్కు సానియా సలహాలు
- టెన్నిస్ రాకెట్ పట్టని వారు కూడా విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు టెక్ సమ్మిట్ 2025లో ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ సానియా మీర్జా అప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ.. భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యురాలు రిచా ఘోష్కు సలహాలు ఇచ్చారు. సోషల్ మీడియాను అస్సలు పట్టించుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోవాలని, పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకూడదని చెప్పారు. మొదట్లో మహిళల క్రికెట్కు అంత ఆదరణ ఉండేది కాదని, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవారు కాదని.. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయన్నారు. టెన్నిస్ రాకెట్ పట్టని వారు కూడా విమర్శలు చేశేవారని.. ఒక్కోసారి జాలి కలిగేదని సానియా చెప్పుకొచ్చారు.
‘రిచా ఘోష్ యువ క్రీడాకారిణి. ఈ తరంలో ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాను ఆమె చూస్తోంది. మా రోజుల్లో వార్త పత్రికలే ఉండేవి. వాటి పైనే మేము ఆధారపడేవాళ్లం. ఎలక్ట్రానిక్ మీడియా అప్పటినుంచి వ్యక్తిగత జీవితాల మీద ఫోకస్ ఎక్కువగా పెరిగింది. ముందురోజు డిన్నర్కు వెళ్లడం వల్లే మ్యాచ్ ఓడిపోయింది అంటూ లేనిపోని కథనాలు అల్లేవారు. ఇలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నాకు ఇవన్నీ హాస్యాస్పదంగా అనిపించేవి. ఒక్కసారి టెన్నిస్ రాకెట్ చేత్తో తాకని వారు కూడా క్రీడాకారుల గురించి మాట్లాడడం నాకు నవ్వు తెప్పించేది. నాకు వాళ్లను చూస్తే జాలి కలిగేది. జీవితంలో ఆనందంగా లేనివారే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై బురద చల్లే ప్రయత్నం చేస్తారు. మంచైనా, చెడైనా మన మనసులోకి తీసుకోవద్దు. సోషల్ మీడియా ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోవాలి’ అని సానియా మీర్జా అన్నారు.
Also Read
- Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
- Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
- BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!