Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautham Gambhir : భారత క్రికెట్ జట్టు వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్పై ఆధిపత్యం చాటుతున్న సమయంలో మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్ శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఇటీవల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చరిత్ర సృష్టించి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్నా, ఆ విజయానికి ప్రధాన కారణం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాదని శ్రీశాంత్ బహిరంగంగా వ్యాఖ్యానించడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఆఫ్ఘనిస్థాన్తో జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబ్ షో గెస్ట్ ఇన్ ది న్యూస్రూమ్లో పాల్గొన్న శ్రీశాంత్, భారత జట్టు ప్రపంచకప్ విజయంలో ఆటగాళ్ల పాత్రనే అత్యంత కీలకమని పేర్కొన్నారు. టైటిల్ గెలిచిన వెంటనే మొత్తం క్రెడిట్ గౌతమ్ గంభీర్కు వెళ్లిపోయిందని, కానీ మైదానంలో మ్యాచ్ను మలుపుతిప్పిన వారు ఆటగాళ్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
- Virat Kohli : ఇంగ్లాండ్ పై విరాట్ కోహ్లీ ఆడతాడా? గాయంపై కీలక అప్డేట్!
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
- Rishab Pant: LSGలో మాత్రం ఉండను బాబోయ్.. ఆర్థిక నష్టానికైనా రెడీ అవుతున్న రిషబ్ పంత్..
- Team India: వాళ్లు ఫ్యామిలీలతో గడపొద్దా..? మాజీ కెప్టెన్ ఆగ్రహం..
సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు కీలక సమయాల్లో నిలబడకపోయి ఉంటే, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం సమర్థంగా లేకపోయి ఉంటే, బౌలింగ్ మార్పులు సరైన సమయంలో జరగకపోయి ఉంటే భారత్ విజయం సాధించేదా అని శ్రీశాంత్ ప్రశ్నించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిర్ణయాలు తీసుకుంటున్నది కోచ్ కాదని, మైదానంలో ఉన్న కెప్టెన్, ఆటగాళ్లేనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఆశిష్ నెహ్రా వంటి కోచ్లు జట్టుతో మరింత ప్రత్యక్షంగా మమేకమై ఉంటారని కూడా వ్యాఖ్యానించారు.
గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు తాజాగా టీ20 ప్రపంచకప్ను కూడా సొంతం చేసుకుంది. అయినప్పటికీ జట్టు టెస్టు ఫార్మాట్లో ఎదుర్కొన్న పరాజయాలను గుర్తు చేస్తూ శ్రీశాంత్ మరింత ఘాటైన విమర్శలు చేశారు.
దశాబ్దానికి పైగా స్వదేశంలో దాదాపు అజేయంగా కొనసాగిన భారత టెస్టు జట్టు గత రెండు సంవత్సరాల్లో అనూహ్య పరాజయాలను చవిచూసింది. 2024 చివర్లో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో వైట్వాష్ కావడం, ఆ తర్వాత 2025లో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్ కోల్పోవడం అభిమానులను నిరాశకు గురిచేశాయి. అంతేకాదు 2025 ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3తో చేజార్చుకోవడంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు కూడా భారత్ అర్హత సాధించలేకపోయింది. టోర్నమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ నేపథ్యంలో భారత్కు కోచ్ కంటే మెంటర్ అవసరమని శ్రీశాంత్ అభిప్రాయపడ్డారు. మహేంద్రసింగ్ ధోనీ తరహాలో ఆటగాళ్లతో సోదరభావంతో మెలిగే వ్యక్తి జట్టుకు అవసరమని ఆయన పేర్కొన్నారు. గెలిచినప్పుడు నవ్వుతూ, ఓడినప్పుడు కోపపడటం మాత్రమే నాయకత్వం కాదని, ఆటగాళ్లను అర్థం చేసుకునే మార్గదర్శకుడు జట్టును మరింత బలంగా మార్చగలడని చెప్పారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ ఇద్దరూ సహచర ఆటగాళ్లుగా భారత జట్టులో భాగమయ్యారు. ఒకప్పుడు కలిసి ప్రపంచకప్లు గెలిచిన ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు అభిప్రాయ భేదాలు బహిరంగ చర్చకు రావడం భారత క్రికెట్లో మరో ఆసక్తికర అంశంగా మారింది.
తాజావార్తలు
-
Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
-
Virat Kohli : ఇంగ్లాండ్ పై విరాట్ కోహ్లీ ఆడతాడా? గాయంపై కీలక అప్డేట్!
-
Astrology: కోపం త్వరగా వచ్చినా.. అంతే వేగంగా మర్చిపోయే 4 రాశులు ఇవేనా? మనసులో పగ పెట్టుకోరట!
-
Vivek Agarwal: FATF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్.. ప్రపంచ వేదికపై పెరిగిన భారత ప్రతిష్ఠ
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!