Rohit Sharma: టెస్ట్ మ్యాచ్ మూడు రోజులేనా.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన రోహిత్
Rohit Sharma Reacts On 3 Days Test Match Comments: ఈమధ్య టెస్ట్ మ్యాచ్లు మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. అంతెందుకు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్లు కూడా మూడు రోజుల్లోపే ముగిసిపోయాయి. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే.. రెండున్నర రోజుల్లోనే ఆ మూడు టెస్ట్లో ముగిశాయి. దీనిపై క్రీడాభిమానుల దగ్గర నుంచి మాజీల దాకా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్రీడాకారులు తమ నైపుణ్యం కోల్పోతున్నారా? టెస్ట్ మ్యాచ్ని పూర్తి స్థాయిలో ఎందుకు ఐదు రోజులు ఆడలేకపోతున్నారు? అనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశ్నలకు రోహిత్ శర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
Husband Forces Wife: ప్రమోషన్ కోసం బాస్తో పడుకోమన్న భర్త.. ఆ పని చేసిన భార్య
Also Read
- Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
- Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
- World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
- IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్మెన్ దూరం..
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఒక టెస్ట్ మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగాలంటే, ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. కేవలం భారత్లో మాత్రమే కాదు, విదేశాల్లోనూ టెస్ట్ మ్యాచ్లు ఐదు రోజుల పాటు జరగట్లేదు. ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన మ్యాచ్ కూడా కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. అయితే.. పాకిస్తాన్లో మాత్రం ఐదు రోజుల పాటు జరిగే టెస్ట్ మ్యాచ్ బోర్ కొడుతోందని అభిమానులు అంటున్నారు. అందుకే, మేము మ్యాచ్లను మూడు రోజుల్లోనే పూర్తి చేస్తున్నాం’’ అంటూ ఘాటుగా చెప్పుకొచ్చాడు. ఓవైపు ఆ ప్రశ్నలకు సీరియస్గా జవాబు ఇస్తూనే, మరోవైపు పాక్ టెస్ట్ మ్యాచ్లు బోరింగ్గా ఉంటాయంటూ.. పరోక్షంగా చురకలంటించాడు రోహిత్ శర్మ.
Tractor Goes Viral : ట్రాక్టర్ పై దెయ్యం..? దానంతట అదే స్టార్ట్ అయ్యి..
ఇంకా మాట్లాడుతూ.. ఒక టెస్ట్ మ్యాచ్లో ఓడిపోతే, చాలా విషయాలు మన చేతుల్లో లేవని అర్థం చేసుకోవాలన్నాడు. తొలుత బ్యాటింగ్లో సరైన ఆరంభం దక్కలేదని, ప్రత్యర్థి తమపై ఆధిక్యం చెలాయించాక తొలి ఇన్నింగ్స్లో తమ స్కోర్ బోర్డుపై మరిన్ని పరుగులుంటే బాగుండేదనిపించిందని అన్నాడు. రెండో ఇన్నింగ్స్లోనూ అనుకున్న విధంగా బ్యాటింగ్ సాగలేదన్నాడు. ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఆలోంచించలేదని, అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. ప్రణాళికలను అమలు చేయడంలో జరిగిన తప్పిదాల వల్లే ఓడిపోయామని, తప్పకుండా పుంజుకుంటామని రోహిత్ తెలిపాడు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?