Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్.. ధోనీ, కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచిన కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. 2015 నుంచి ఇప్పటివరకు భారత్లో దక్షిణాఫ్రికా నాలుగు సార్లు టీ20 సిరీస్ ఆడింది. తొలి సిరీస్లో టీమిండియా ఓటమి పాలైంది. రెండు, మూడు సిరీస్లు మాత్రం డ్రాగా ముగిశాయి. తొలి సిరీస్కు ధోనీ, రెండో సిరీస్కు కోహ్లీ, మూడో సిరీస్కు పంత్ నాయకత్వం వహించారు. ఇప్పుడు నాలుగో సిరీస్లో మాత్రం టీమిండియా దుమ్మురేపింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ధోనీ, కోహ్లీ వంటి దిగ్గజాలకు సాధ్యం కాని సిరీస్ విజయాన్ని రోహిత్ శర్మ సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు.
Read Also: Suryakumar Yadav: మ్యాక్స్వెల్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్
Also Read
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
- Dean Elgar Retirement: క్రికెట్కు గుడ్బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
- IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
2015లో డుప్లెసిస్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా భారత్లో టీ20 సిరీస్ ఆడింది. అప్పుడు ధోనీ నాయకత్వలోని జట్టు తొలి టీ20, రెండో టీ20లలో ఓడిపోయింది. మూడో టీ20 మాత్రం వర్షం కారణంగా రద్దయ్యింది. అనంతరం 2019లో డికాక్ కెప్టెన్సీలో మరోసారి దక్షిణాఫ్రికా భారత గడ్డపై టీ20 సిరీస్ ఆడగా తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. రెండో టీ20లో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. మూడో టీ20లో కెప్టెన్ డికాక్ హాఫ్ సెంచరీ చేసి దక్షిణాఫ్రికాను గెలిపించాడు. దీంతో సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ ఏడాది జూన్లో దక్షిణాఫ్రికా జట్టు భారత గడ్డపై ఐదు టీ20ల సిరీస్ ఆడింది. రిషబ్ పంత్ ఈ సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ సిరీస్ 2-2గా సమంగా ముగిసింది. ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ గెలవడంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి పటిష్ట జట్లపై టీ20 సిరీస్ గెలిచిన కెప్టెన్గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. అటు 2021 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు ఆరు ద్వైపాక్షిక టీ20 సిరీస్ల్లో విజయం సాధించడం విశేషం.
తాజావార్తలు
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!