Rishabh Pant : ఐపీఎల్ లోకి నేనొస్తున్నాను.. ఇంత మోసం చేస్తావా.. రిషబ్ పంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందరు ఆడుతున్నారు.. నేనెందుకు ఆడకూడదు.. నేనింకా గేమ్ లోనే ఉన్నా.. ఐపీఎల్ ఆడడానికి త్వరలోనే మీ ముందుకు వస్తున్నా.. అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రిషబ్ పంత్ వెల్లడించాడు. దీంతో పంత్ మాటలు విన్న అభిమానులు ఆనందపడిపోయారు. కానీ అది ప్రమోషనల్ వీడియో అని తెలియగానే అందరు చల్లబడ్డారు.
Rishabh Pant is back! pic.twitter.com/3uu51Nz0AO
Also Read
- Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది".. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2023
Also Read : Amit Shah: రాహుల్ అనర్హత వేటుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ లేని లోటు తెలుస్తోంది. దీంతో అతనితో ప్రమోషనల్ వీడియో చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ అనుకుంది. అనుకుందే తడవుగా.. అతనితో వీడియో చేసి ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రస్తుతం పంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియో చూసిన అభిమానులు.. ఐపీఎల్ కు నువ్వు వస్తున్నావని తెగ సంతోష పడిపోయాం.. ఇంత మోసం చేస్తావా పంత్.. తొందరగా కోలుకో పంత్ పంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన ప్రమోషనల్ వీడియోలో పంత్ మాట్లాడుతూ.. క్రికెట్ పుడ్.. ఈ రెండింటిని వదిలి నేు బతకలేను.. యాక్సిడెంట్ కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్ ఆడలేకపోయాను.. ఇష్టమైన ఫుడ్ తినలేకపోయాను.. అయితే కాస్త కోలుకున్నాకా డాక్టర్ మంచిగా తింటే తొందరగా రికవరీ అవుతావన్నారు.. అందుకే ఆరోగ్యానికి మంచిదైన ఇంటిఫుడ్ ఎక్కువగా తీసుకున్నా.. క్రికెట్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నా.. ఎందుకు క్రికెట్ ఆడకూడదు అనిపించింది. అందరు ఆడుతున్నారు.. నేనెందుకు.. ఇంకా గేమ్ లోనే ఉన్న.. మ్యాచ్ లు ఆడడానికి వస్తున్నా అంటూ పేర్కొన్నాడు.
Also Read : Rohit Sharma : ఆందోళన ఎందుకు.. ఎలా ఆడాలో మాకు తెలుసు..
గతేడాది డిసెంబర్ లో రిషబ్ పంత్ కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి లక్నో వస్తుండగా రూర్కీ సమీపంలో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పలు సర్జరీల అనంతరం పంత్ కోలుకుంటున్నాడు. ఫలితంగా దాదాపు తొమ్మిది నెలలు క్రికెట్ కు దూరమయ్యాడు. అయితే వేగంగానే కోలుకుంటుండడంతో అనుకున్న దాని కంటే ముందుగానే మైదానంలో రిషబ్ పంత్ అడుగుపెడతాని ధీమా వ్యక్తం చేశాడు. ఇక యాక్సిడెంట్ తో ఐపీఎల్ తో పాటు వన్డే ప్రపంచకప్ కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఐపీఎల్ కు దూరం కావడంతో పంత్ సేవలను ఢిల్లీ క్యాపిటల్స్ కోల్పోయింది. పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ లో కెప్టెన్ గా వార్నర్ కు అనుభవంతో పాటు మంచి పేరు ఉంది. ఇక పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్ ను ఎంపిక చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. ఏప్రిల్ ఒకటిన లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!