Rishabh Pant : ఐపీఎల్ లోకి నేనొస్తున్నాను.. ఇంత మోసం చేస్తావా.. రిషబ్ పంత్
అందరు ఆడుతున్నారు.. నేనెందుకు ఆడకూడదు.. నేనింకా గేమ్ లోనే ఉన్నా.. ఐపీఎల్ ఆడడానికి త్వరలోనే మీ ముందుకు వస్తున్నా.. అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రిషబ్ పంత్ వెల్లడించాడు. దీంతో పంత్ మాటలు విన్న అభిమానులు ఆనందపడిపోయారు. కానీ అది ప్రమోషనల్ వీడియో అని తెలియగానే అందరు చల్లబడ్డారు.
Rishabh Pant is back! pic.twitter.com/3uu51Nz0AO
Also Read
- మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
- Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2023
Also Read : Amit Shah: రాహుల్ అనర్హత వేటుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ లేని లోటు తెలుస్తోంది. దీంతో అతనితో ప్రమోషనల్ వీడియో చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ అనుకుంది. అనుకుందే తడవుగా.. అతనితో వీడియో చేసి ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రస్తుతం పంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియో చూసిన అభిమానులు.. ఐపీఎల్ కు నువ్వు వస్తున్నావని తెగ సంతోష పడిపోయాం.. ఇంత మోసం చేస్తావా పంత్.. తొందరగా కోలుకో పంత్ పంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన ప్రమోషనల్ వీడియోలో పంత్ మాట్లాడుతూ.. క్రికెట్ పుడ్.. ఈ రెండింటిని వదిలి నేు బతకలేను.. యాక్సిడెంట్ కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్ ఆడలేకపోయాను.. ఇష్టమైన ఫుడ్ తినలేకపోయాను.. అయితే కాస్త కోలుకున్నాకా డాక్టర్ మంచిగా తింటే తొందరగా రికవరీ అవుతావన్నారు.. అందుకే ఆరోగ్యానికి మంచిదైన ఇంటిఫుడ్ ఎక్కువగా తీసుకున్నా.. క్రికెట్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నా.. ఎందుకు క్రికెట్ ఆడకూడదు అనిపించింది. అందరు ఆడుతున్నారు.. నేనెందుకు.. ఇంకా గేమ్ లోనే ఉన్న.. మ్యాచ్ లు ఆడడానికి వస్తున్నా అంటూ పేర్కొన్నాడు.
Also Read : Rohit Sharma : ఆందోళన ఎందుకు.. ఎలా ఆడాలో మాకు తెలుసు..
గతేడాది డిసెంబర్ లో రిషబ్ పంత్ కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి లక్నో వస్తుండగా రూర్కీ సమీపంలో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పలు సర్జరీల అనంతరం పంత్ కోలుకుంటున్నాడు. ఫలితంగా దాదాపు తొమ్మిది నెలలు క్రికెట్ కు దూరమయ్యాడు. అయితే వేగంగానే కోలుకుంటుండడంతో అనుకున్న దాని కంటే ముందుగానే మైదానంలో రిషబ్ పంత్ అడుగుపెడతాని ధీమా వ్యక్తం చేశాడు. ఇక యాక్సిడెంట్ తో ఐపీఎల్ తో పాటు వన్డే ప్రపంచకప్ కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఐపీఎల్ కు దూరం కావడంతో పంత్ సేవలను ఢిల్లీ క్యాపిటల్స్ కోల్పోయింది. పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ లో కెప్టెన్ గా వార్నర్ కు అనుభవంతో పాటు మంచి పేరు ఉంది. ఇక పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్ ను ఎంపిక చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. ఏప్రిల్ ఒకటిన లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!