IPL 2024: 2024లో ఆర్సీబీ కెప్టెన్ మారే ఛాన్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గత 16 సీజన్లుగా టైటిల్ గెలుచుకోవాలనే కల ఇప్పటికే నెరవేర లేదు.. ఆర్సీబీ టీమ్ కి టైటిల్ అందని ద్రాక్షలా మారింది. ఈ సాలా కప్ నామ్దే అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించిన ఆర్సీబీ ఈసారి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ముఖ్యంగా 14 మ్యాచుల్లో 7 మాత్రమే గెలిచిన ఆర్సీబీ జట్టు నాయకత్వంపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈసారి ఆర్సీబీ సొంతగడ్డపై 7 మ్యాచ్లు ఆడింది. చిన్నస్వామి స్టేడియంలో కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. 2019 తర్వాత ఆర్సీబీ టీమ్ లీగ్ దశలోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. దీంతో ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వంపై సందేహాలు వస్తున్నాయి.
Also Read : Bullet Train: అనేక దేశాల్లో బుల్లెట్ ట్రైన్స్ నడుస్తున్నాయి.. కానీ ఎందుకు పట్టాలు తప్పడం లేదు?
Also Read
- IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
- India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- India vs Sri Lanka Test: మానవ్ సుతార్ సంచలనం.. అశ్విన్, హర్భజన్ రికార్డులు బద్దలు..!
గత రెండు సీజన్లలో డుప్లెసిస్ ఆర్సీబీ జట్టుకు కెప్టెన్సీ వహించాడు. ఐపీఎల్ సీజన్ 16లో ఫాఫ్ సారథ్యంలో ఆర్సీబీ మొత్తం 27 మ్యాచ్లు ఆడింది. అయితే 14 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. అంటే డుప్లెసిస్ సారథ్యంలో ఆర్సీబీ 13 మ్యాచుల్లో ఓడిపోయింది. మరోవైపు చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు టీమ్ ఈసారి కేవలం 3 మ్యాచ్ల్లో గెలిచింది. ఆ మూడు మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోనే 1 మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.. అంటే డుప్లెసిస్ కెప్టెన్సీలో ఆర్సీబీ కేవలం 2 మ్యాచ్లు మాత్రమే విజయం సాధించింది. డుప్లెసిస్ గైర్హాజరీతో ఈసారి విరాట్ కోహ్లి మూడు మ్యాచ్లకు ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించాడు. కెప్టెన్గా తన నేచురల్ దూకుడు స్వభావంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీన్ని బట్టి మళ్లీ కోహ్లికి ఆర్సీబీ ఫ్రాంచైజీ కెప్టెన్సీ ఇస్తుందా? అనే క్వశ్చన్స్ తలెత్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : Pakistan: పాకిస్తాన్కు నరేంద్రమోడీ కన్నా ఆయనతోనే పెద్ద ముప్పు..
ఆర్సీబీ జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకోవడం వెనుక ప్రధాన కారణం నాయకత్వ భారమే.. భారత జట్టును, ఆర్సీబీని నడిపించడం భారంగా మారుతోంది. తద్వారా లీగ్ క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ గతంలో ప్రకటించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విరాట్ కోహ్లీ పూర్తిగా స్వేచ్ఛగా ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఫాఫ్ డుప్లెసిస్ వరుసగా రెండు సీజన్లలో జట్టును నడిపించినా.. ఆశించిన ప్రదర్శన రాలేదు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఆర్బీసీ 3 సార్లు ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించగా, ఒకసారి ఫైనల్ ఆడింది. వీటన్నింటినీ పరిశీలిస్తే.. వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆర్బీబీ ఫ్రాంచైజీ మళ్లీ విరాట్ కోహ్లీకి కెప్టెన్సీని ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అనే టాక్ వినిపిస్తుంది.
తాజావార్తలు
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!