IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గత 16 సీజన్లుగా టైటిల్ గెలుచుకోవాలనే కల ఇప్పటికే నెరవేర లేదు.. ఆర్సీబీ టీమ్ కి టైటిల్ అందని ద్రాక్షలా మారింది. ఈ సాలా కప్ నామ్దే అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించిన ఆర్సీబీ ఈసారి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ముఖ్యంగా 14 మ్యాచుల్లో 7 మాత్రమే గెలిచిన ఆర్సీబీ జట్టు నాయకత్వంపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈసారి ఆర్సీబీ సొంతగడ్డపై 7 మ్యాచ్లు ఆడింది. చిన్నస్వామి స్టేడియంలో కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. 2019 తర్వాత ఆర్సీబీ టీమ్ లీగ్ దశలోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. దీంతో ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వంపై సందేహాలు వస్తున్నాయి.
Also Read : Bullet Train: అనేక దేశాల్లో బుల్లెట్ ట్రైన్స్ నడుస్తున్నాయి.. కానీ ఎందుకు పట్టాలు తప్పడం లేదు?
గత రెండు సీజన్లలో డుప్లెసిస్ ఆర్సీబీ జట్టుకు కెప్టెన్సీ వహించాడు. ఐపీఎల్ సీజన్ 16లో ఫాఫ్ సారథ్యంలో ఆర్సీబీ మొత్తం 27 మ్యాచ్లు ఆడింది. అయితే 14 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. అంటే డుప్లెసిస్ సారథ్యంలో ఆర్సీబీ 13 మ్యాచుల్లో ఓడిపోయింది. మరోవైపు చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు టీమ్ ఈసారి కేవలం 3 మ్యాచ్ల్లో గెలిచింది. ఆ మూడు మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోనే 1 మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.. అంటే డుప్లెసిస్ కెప్టెన్సీలో ఆర్సీబీ కేవలం 2 మ్యాచ్లు మాత్రమే విజయం సాధించింది. డుప్లెసిస్ గైర్హాజరీతో ఈసారి విరాట్ కోహ్లి మూడు మ్యాచ్లకు ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించాడు. కెప్టెన్గా తన నేచురల్ దూకుడు స్వభావంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీన్ని బట్టి మళ్లీ కోహ్లికి ఆర్సీబీ ఫ్రాంచైజీ కెప్టెన్సీ ఇస్తుందా? అనే క్వశ్చన్స్ తలెత్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : Pakistan: పాకిస్తాన్కు నరేంద్రమోడీ కన్నా ఆయనతోనే పెద్ద ముప్పు..
ఆర్సీబీ జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకోవడం వెనుక ప్రధాన కారణం నాయకత్వ భారమే.. భారత జట్టును, ఆర్సీబీని నడిపించడం భారంగా మారుతోంది. తద్వారా లీగ్ క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ గతంలో ప్రకటించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విరాట్ కోహ్లీ పూర్తిగా స్వేచ్ఛగా ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఫాఫ్ డుప్లెసిస్ వరుసగా రెండు సీజన్లలో జట్టును నడిపించినా.. ఆశించిన ప్రదర్శన రాలేదు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఆర్బీసీ 3 సార్లు ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించగా, ఒకసారి ఫైనల్ ఆడింది. వీటన్నింటినీ పరిశీలిస్తే.. వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆర్బీబీ ఫ్రాంచైజీ మళ్లీ విరాట్ కోహ్లీకి కెప్టెన్సీని ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అనే టాక్ వినిపిస్తుంది.