Ravindra Jadeja: జడేజాపై అభిమానుల ఫైర్.. దేశం కంటే భార్య ఎన్నికలు ముఖ్యమా?
Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దేశం కంటే భార్య పోటీ చేస్తున్న ఎన్నికలు ముఖ్యమా అని నిలదీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జడేజా గాయం కారణంగా ఆసియా కప్ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకోవడంతో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీకి కూడా దూరంగా ఉన్నాడు. అయితే వచ్చేనెలలో జరిగే బంగ్లాదేశ్ పర్యటనకు బీసీసీఐ జడేజాను ఎంపిక చేసింది. కానీ తనకు ఇంకా గాయం నయం కాలేదని ఈ టూర్ నుంచి జడేజా తప్పుకున్నాడు. అయితే జడేజా చెప్పిందొకటి.. చేస్తుందొకటి కావడంతో టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాయం నుంచి కోలుకోలేదని చెప్పిన జడేజా విశ్రాంతి తీసుకోకుండా భార్య తరఫున గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు దూరమయ్యాడని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కాగా ఈ ఏడాది డిసెంబర్లో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుండి బీజేపీ తరుఫున బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో జడేజా తన భార్యకు మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఇటీవల తన భార్యతో దగ్గరుండి నామినేషన్ వేయించిన జడేజా.. భార్య గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాడు. తన భార్యకు ప్రజా సేవ అంటే ఇష్టమని.. తను కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. భార్య కోసం జడేజా ప్రచారం చేయడం బాగానే ఉన్నా.. స్వప్రయోజనాల కోసం దేశం తరఫున ప్రాతినిథ్యం వహించకుండా తప్పించుకోవడం సిగ్గుచేటని జడేజాపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read
- Shreyas Iyer: "నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను".. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
- Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
Read Also: Selfie Tragedy: సెల్ఫీ మోజులో నలుగురు యువతులు బలి
అయితే బీజేపీ మద్దతుతోనే జడేజా ఇలా వ్యవహరిస్తున్నాడని పలువురు అతడిని ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ క్రికెట్లో కూడా రాజకీయాలు చేస్తోందని మండిపడుతున్నారు. అమిత్ షా కొడుకు జై షా సపోర్ట్తోనే జడేజా బంగ్లాదేశ్ టూర్కు వెళ్లకుండా బీజేపీ కోసం ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. జడేజాకు దేశం కంటే భార్య ఎన్నికలే ముఖ్యమైయ్యాయని.. జడేజాను టీమిండియాను నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!