Ravichandran Ashwin: బ్యాటర్లను కాపాడటానికి బౌలర్లను బలి చేస్తారా..?
- ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘోర పరాజయం..
- టీమిండియా మేనేజ్మెంట్పై మండిపడిన రవిచంద్రన్ అశ్విన్..
- బ్యాటర్లను కాపాడటానికి బౌలర్లను బలి చేస్తారా: స్పిన్ దిగ్గజం అశ్విన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravichandran Ashwin: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘోర పరాజయం పాలైంది. 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా మేనేజ్మెంట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. పెర్త్ వన్డేలో భారత జట్టు కూర్పు సరిగ్గా లేదని.. బ్యాటింగ్ డెప్త్ కోసం బౌలింగ్ విభాగాన్ని నీరు గార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విషయంలో మేనేజ్మెంట్ తీరును అశూ తప్పుబట్టాడు. వాళ్లు కేవలం ఇద్దరు స్పిన్నర్లతోనే ఎందుకు ఆడారో నాకు అర్థం కావడం లేదు.. పేస్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడించింది బ్యాటింగ్లో డెప్త్ కోసమే.. ఇక స్పిన్ ఆల్రౌండర్లు సుందర్, అక్షర్ కూడా బ్యాటింగ్ చేస్తారు కాబట్టి నితీశ్ను వారికి జతచేశారు అని పేర్కొన్నారు.
Read Also: Delhi: ఢిల్లీలో మళ్లీ బెంబేలెత్తిస్తున్న పొల్యూషన్.. పడిపోయిన గాలి నాణ్యత
Also Read
- Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్దే టైటిల్!
- IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్కు లక్కీ ఛాన్స్!
- Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో తొలి వ్యక్తిగత 'స్వర్ణం' కైవసం.!
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్పై భారత్ 19-0తో సంచలన విజయం.!
ఇక, అసలు మీరెందుకు ( టీమిండియా మేనేజ్మెంట్) బౌలింగ్పై దృష్టి పెట్టడం లేదు బాస్ అని అశ్విన్ ప్రశ్నించారు. ఇలాంటి పెద్ద మైదానాల్లో కాకపోతే కుల్దీప్ యాదవ్ ఇంకెక్కడ స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలడు?.. ఈ పిచ్పై బంతిని తిప్పుతూ అతడు బౌన్స్ కూడా రాబట్టగలడు అని పేర్కొన్నారు. ఏదైనా అంటే.. బ్యాటింగ్ డెప్త్ అని మాట్లాడుంటారు.. బ్యాటింగ్ ఆర్డర్ రాణించాలంటే.. బ్యాటర్లే పూర్తి బాధ్యత తీసుకోవాలి.. పరుగులు రాబట్టడం వాళ్ల పని.. కానీ, అదనపు బ్యాటర్ కోసం ఆల్రౌండర్లను ఆడించి బ్యాటర్ల పని మరింత సులువు చేయాల్సిన అవసరం ఏముంది? అని క్వశ్చన్ చేశారు. జట్టులో ఉన్న అత్యుత్తమ బౌలర్లను పక్కన పెట్టడం ఎంత వరకు సమంజసం? అని రవిచంద్రన్ అశ్విన్ అడిగారు.
Read Also: Bandla Ganesh Party: ప్లేట్ 15వేలు.. నైటుకు కోటిన్నర
అయితే, ఆస్ట్రేలియాతో బౌలర్ల ధాటికి భారత టాపార్డర్ నెలకూలింది. రోహిత్ శర్మ 8, గిల్ 10, శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేయగా.. విరాట్ కోహ్లి డకౌట్ అయి తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఇక, కేఎల్ రాహుల్ 28, అక్షర్ పటేల్ 31 పరుగులతో రాణించి జట్టు పరువు కాపాడారు. ఆల్రౌండర్లలో వాషింగ్టన్ సుందర్(10), నితీశ్ కుమార్ రెడ్డి 19 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు. వర్షం కారణంగా మ్యాచ్ ను 26 ఓవర్లకు కుదించగా.. తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులే చేసింది టీమిండియా.. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ 21.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు నష్టానికి 131 పరుగులు చేసింది. కాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆసీస్- భారత్ మధ్య గురువారం నాడు అడిలైడ్ వేదికగా రెండో వన్డే జరగనుంది.
Just when #TeamIndia needed it most! @Sundarwashi5 breaks a crucial partnership. 👏#AUSvIND 👉 1st ODI | LIVE NOW 👉 https://t.co/FkZ5L4CrRl pic.twitter.com/6e1VZmbAjz
— Star Sports (@StarSportsIndia) October 19, 2025
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?