Rahul Dravid: వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్గా రాహుల్ ద్రవిడ్ కొడుకు
- టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కొడుకుకు అద్భుత అవకాశం..
- వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్గా ఎంపికైనా అన్వయ్ ద్రవిడ్..
- అద్భుతమైన ఫామ్ తో జట్టును ముందుండి నడిపిస్తున్న అన్వయ్ ద్రవిడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Dravid: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ క్రికెట్లో అద్భుతమైన ఆట తీరును కనబరుస్తున్నాడు. అండర్-19 వన్డే టోర్నమెంట్ అయినా వినూ మన్కడ్ ట్రోఫీ కోసం ప్రకటించిన కర్ణాటక జట్టుకు అన్వయ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇక, యువ క్రికెటర్లకు తమ సత్తాను నిరూపించుకోవడానికి వినూ మన్కడ్ ట్రోఫీ ఒక వేదిక అని చెప్పాలి. ఈ టోర్నమెంట్లో అన్వయ్కు కెప్టెన్సీ దక్కడం అతను స్థిరమైన ప్రదర్శనను తెలియజేస్తోంది. 18 ఏళ్ల అన్వయ్ గత సీజన్లో కర్ణాటకకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా నిలిచాడు.
Read Also: Adivi Sesh : అడివిశేష్ ‘డెకాయిట్’ క్రిస్మస్ రిలీజ్ వాయిదా..
Also Read
- India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
- India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
- ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
- MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
అద్భుతమైన ఫామ్:
ఇటీవలి కాలంలో అన్వయ్ ద్రవిద్ ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అతను వరుసగా రెండో సీజన్లో కూడా కర్ణాటక రన్ ఛార్ట్లలో అగ్రస్థానంలో నిలిచాడు. కేవలం ఆరు మ్యాచ్ల్లోనే 459 పరుగులు చేసి, 91.80 సగటుతో అద్భుతంగా రాణించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అన్వయ్ స్థిరమైన బ్యాటింగ్ తో కర్ణాటక క్రికెట్లో కీలకంగా మారిపోయాడు.
వినూ మన్కడ్ ట్రోఫీకి కర్ణాటక జట్టు:
అన్వయ్ ద్రవిడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ ఆర్య, ఆదర్శ్ డి ఉర్స్, ఎస్. మణికంఠ్ (వైస్ కెప్టెన్), ప్రణీత్ శెట్టి, వాసవ్ వెంకటేష్, అక్షత్ ప్రభాకర్, సి. వైభవ్, కులదీప్ సింగ్ పురోహిత్, రతన్ బి.ఆర్, వైభవ్ శర్మ, కేఏ తేజస్, అథర్వ్ మాలవీయ, సన్నీ కంచి మరియు రెహాన్ మహమ్మద్ (వికెట్ కీపర్).
Read Also: FAPTO Protest: విజయవాడలో ఫ్యాప్టో (FAPTO) ఆందోళన.. డిమాండ్లు ఇవే..
రంజీ ట్రోఫీ జట్టులో కరుణ్ నాయర్ రీఎంట్రీ:
ఇదిలా ఉండగా, సీనియర్ రంజీ ట్రోఫీకి కూడా కర్ణాటక తమ జట్టును ప్రకటించింది. మయాంక్ అగర్వాల్ కెప్టెన్గా కొనసాగనుండగా, కీలక ప్లేయర్ కరుణ్ నాయర్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. ఈ జట్టులో ఆర్ స్మరణ్, కేఎల్ శ్రీజిత్, శ్రేయస్ గోపాల్, వైశాఖ్ విజయకుమార్, విద్వత్ కావేరప్ప, అభిలాష్ శెట్టి లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు.
తాజావార్తలు
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
-
Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
-
Nepal Floods: నేపాల్కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!