Rahul Dravid: వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్గా రాహుల్ ద్రవిడ్ కొడుకు
- టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కొడుకుకు అద్భుత అవకాశం..
- వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్గా ఎంపికైనా అన్వయ్ ద్రవిడ్..
- అద్భుతమైన ఫామ్ తో జట్టును ముందుండి నడిపిస్తున్న అన్వయ్ ద్రవిడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Dravid: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ క్రికెట్లో అద్భుతమైన ఆట తీరును కనబరుస్తున్నాడు. అండర్-19 వన్డే టోర్నమెంట్ అయినా వినూ మన్కడ్ ట్రోఫీ కోసం ప్రకటించిన కర్ణాటక జట్టుకు అన్వయ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇక, యువ క్రికెటర్లకు తమ సత్తాను నిరూపించుకోవడానికి వినూ మన్కడ్ ట్రోఫీ ఒక వేదిక అని చెప్పాలి. ఈ టోర్నమెంట్లో అన్వయ్కు కెప్టెన్సీ దక్కడం అతను స్థిరమైన ప్రదర్శనను తెలియజేస్తోంది. 18 ఏళ్ల అన్వయ్ గత సీజన్లో కర్ణాటకకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా నిలిచాడు.
Read Also: Adivi Sesh : అడివిశేష్ ‘డెకాయిట్’ క్రిస్మస్ రిలీజ్ వాయిదా..
Also Read
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
- R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
అద్భుతమైన ఫామ్:
ఇటీవలి కాలంలో అన్వయ్ ద్రవిద్ ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అతను వరుసగా రెండో సీజన్లో కూడా కర్ణాటక రన్ ఛార్ట్లలో అగ్రస్థానంలో నిలిచాడు. కేవలం ఆరు మ్యాచ్ల్లోనే 459 పరుగులు చేసి, 91.80 సగటుతో అద్భుతంగా రాణించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అన్వయ్ స్థిరమైన బ్యాటింగ్ తో కర్ణాటక క్రికెట్లో కీలకంగా మారిపోయాడు.
వినూ మన్కడ్ ట్రోఫీకి కర్ణాటక జట్టు:
అన్వయ్ ద్రవిడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ ఆర్య, ఆదర్శ్ డి ఉర్స్, ఎస్. మణికంఠ్ (వైస్ కెప్టెన్), ప్రణీత్ శెట్టి, వాసవ్ వెంకటేష్, అక్షత్ ప్రభాకర్, సి. వైభవ్, కులదీప్ సింగ్ పురోహిత్, రతన్ బి.ఆర్, వైభవ్ శర్మ, కేఏ తేజస్, అథర్వ్ మాలవీయ, సన్నీ కంచి మరియు రెహాన్ మహమ్మద్ (వికెట్ కీపర్).
Read Also: FAPTO Protest: విజయవాడలో ఫ్యాప్టో (FAPTO) ఆందోళన.. డిమాండ్లు ఇవే..
రంజీ ట్రోఫీ జట్టులో కరుణ్ నాయర్ రీఎంట్రీ:
ఇదిలా ఉండగా, సీనియర్ రంజీ ట్రోఫీకి కూడా కర్ణాటక తమ జట్టును ప్రకటించింది. మయాంక్ అగర్వాల్ కెప్టెన్గా కొనసాగనుండగా, కీలక ప్లేయర్ కరుణ్ నాయర్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. ఈ జట్టులో ఆర్ స్మరణ్, కేఎల్ శ్రీజిత్, శ్రేయస్ గోపాల్, వైశాఖ్ విజయకుమార్, విద్వత్ కావేరప్ప, అభిలాష్ శెట్టి లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు.
తాజావార్తలు
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?