టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న ద్రవిడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టు మాజీ ఆటగాడు, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైంది. ఇటీవల నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ పదవికి రాజీనామా చేసిన అతడు… మంగళవారం నాడు టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు సమర్పించాడు. ద్రవిడ్తో పాటు అతడి సన్నిహితుడు పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. మరోవైపు ఫీల్డింగ్ కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, హర్యానాకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అజయ్ రత్రా దరఖాస్తు సమర్పించాడు. కాగా బ్యాటింగ్ కోచ్గా మాత్రం ప్రస్తుతం ఉన్న విక్రమ్ రాథోడ్ కొనసాగే అవకాశాలున్నాయి.
Read Also: పాకిస్థాన్పై ఇండియా ఎందుకు ఓడిపోయిందో చెప్పిన సచిన్
Also Read
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- India vs Sri Lanka Test: మానవ్ సుతార్ సంచలనం.. అశ్విన్, హర్భజన్ రికార్డులు బద్దలు..!
- Babar Azam: ఇంగ్లండ్తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
- Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
కాగా ప్రస్తుతం టీమిండియా కోచ్గా కొనసాగుతున్న రవిశాస్త్రి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం బాధ్యతలు చేపట్టాడు. దాదాపుగా నాలుగేళ్లుగా అతడు భారత జట్టుకు తన సేవలు అందిస్తున్నాడు. విచిత్రమేమిటంటే.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత కోచ్ పదవీ బాధ్యతలను చేపట్టిన రవిశాస్త్రి… ప్రస్తుతం టీ20 ప్రపంచకప్లో మళ్లీ పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి తర్వాత కోచ్ పదవిని వీడుతుండటం గమనార్హం. కొత్త కోచ్గా రాహుల్ ద్రవిడ్ టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం బాధ్యతలు చేపట్టే అవకాశముంది. తొలుత టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు ద్రవిడ్ ఆసక్తిని చూపించలేదు. అయితే దుబాయ్ వేదికగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో చర్చించిన తర్వాత ద్రవిడ్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్గా ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ను బీసీసీఐ నియమించనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!