Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
- భారత జట్టులో కీలక మార్పు..
- సిరాజ్ ఔట్, ప్రసిద్ధ్ కృష్ణ ఇన్..
- వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా సిరాజ్కు రెస్ట్..
- నిర్ణయాన్ని వెల్లడించిన బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Siraj: భారత క్రికెట్ జట్టు త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీ20 జట్టులో కీలక మార్పు చేసింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరగనున్న టీ20 సిరీస్ల కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే సిరాజ్ను జట్టు నుంచి తప్పిస్తూ ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం కల్పించింది. సిరాజ్ను గాయం కారణంగా కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు బీసీసీఐ వెల్లడించింది.
బీసీసీఐ వైద్య బృందం మరియు జట్టు యాజమాన్యంతో జరిగిన చర్చల అనంతరం సిరాజ్కు విశ్రాంతి అవసరమని నిర్ణయించామని బోర్డు తెలిపింది. దీర్ఘకాల అంతర్జాతీయ సీజన్ను దృష్టిలో ఉంచుకుని అతని పనిభారాన్ని (వర్క్లోడ్) సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పూర్తి స్థాయిలో కోలుకుని రాబోయే కీలక సిరీస్లకు సిద్ధంగా ఉండేందుకు ఈ విశ్రాంతి ఉపయోగపడుతుందని బీసీసీఐ అభిప్రాయపడింది.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
జూన్ 26 నుంచి ఐర్లాండ్ టూర్ ప్రారంభం
భారత్ తన విదేశీ పర్యటనను ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్తో ప్రారంభించనుంది. బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్, స్టార్మాంట్ వేదికగా జూన్ 26 మరియు జూన్ 28 తేదీల్లో ఈ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. జూలై 1 నుంచి 11 వరకు జరిగే ఈ సిరీస్లో చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలుగా ఎంపికయ్యాయి. టీ20 సిరీస్ అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో కూడా పోటీపడనున్నాయి. జూలై 14, 16, 19 తేదీల్లో వరుసగా బర్మింగ్హామ్, కార్డిఫ్, లార్డ్స్ మైదానాల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
భారత్ టీ20 జట్టు (అప్డేటెడ్ స్క్వాడ్)
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?