Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
- భారత జట్టులో కీలక మార్పు..
- సిరాజ్ ఔట్, ప్రసిద్ధ్ కృష్ణ ఇన్..
- వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా సిరాజ్కు రెస్ట్..
- నిర్ణయాన్ని వెల్లడించిన బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Siraj: భారత క్రికెట్ జట్టు త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీ20 జట్టులో కీలక మార్పు చేసింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరగనున్న టీ20 సిరీస్ల కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే సిరాజ్ను జట్టు నుంచి తప్పిస్తూ ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం కల్పించింది. సిరాజ్ను గాయం కారణంగా కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు బీసీసీఐ వెల్లడించింది.
బీసీసీఐ వైద్య బృందం మరియు జట్టు యాజమాన్యంతో జరిగిన చర్చల అనంతరం సిరాజ్కు విశ్రాంతి అవసరమని నిర్ణయించామని బోర్డు తెలిపింది. దీర్ఘకాల అంతర్జాతీయ సీజన్ను దృష్టిలో ఉంచుకుని అతని పనిభారాన్ని (వర్క్లోడ్) సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పూర్తి స్థాయిలో కోలుకుని రాబోయే కీలక సిరీస్లకు సిద్ధంగా ఉండేందుకు ఈ విశ్రాంతి ఉపయోగపడుతుందని బీసీసీఐ అభిప్రాయపడింది.
Also Read
- SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
- Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
- Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
జూన్ 26 నుంచి ఐర్లాండ్ టూర్ ప్రారంభం
భారత్ తన విదేశీ పర్యటనను ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్తో ప్రారంభించనుంది. బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్, స్టార్మాంట్ వేదికగా జూన్ 26 మరియు జూన్ 28 తేదీల్లో ఈ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. జూలై 1 నుంచి 11 వరకు జరిగే ఈ సిరీస్లో చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలుగా ఎంపికయ్యాయి. టీ20 సిరీస్ అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో కూడా పోటీపడనున్నాయి. జూలై 14, 16, 19 తేదీల్లో వరుసగా బర్మింగ్హామ్, కార్డిఫ్, లార్డ్స్ మైదానాల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
భారత్ టీ20 జట్టు (అప్డేటెడ్ స్క్వాడ్)
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.
తాజావార్తలు
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్డ్రాప్లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్గా ప్రకటించిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!