BAN vs PAK: పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్లో మరో వివాదం.. వైడ్ బాల్కి రివ్యూ, ఐసీసీకి ఫిర్యాదు!
- పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్లో మరో వివాదం
- క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా వైడ్ బాల్ రివ్యూ
- ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్థాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఢాకా వేదికగా ఆదివారం పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మూడో వన్డేలో వివాదం చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి ఓవర్లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంపైర్ తీసుకున్న నిర్ణయం, దానిపై బంగ్లాదేశ్ జట్టు తీసుకున్న రివ్యూ కారణంగా రెండు జట్ల మధ్య వివాదం తలెత్తింది. ఇప్పటికే ఈ సిరీస్లోని రెండో వన్డే మ్యాచ్లో పాక్ బ్యాటర్ సల్మాన్ అలీ అఘా రనౌట్ తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్ విజయానికి చివరి ఓవర్లో 14 రన్స్ అవసరం అయ్యాయి. ఆ ఓవర్ను బంగ్లా స్పిన్నర్ రిషాద్ వేశాడు. తొలి రెండు బంతులకు రిషాద్ పరుగులు ఇవ్వలేదు. మూడో బంతికి రెండు రన్స్ వచ్చాయి. నాలుగో బంతికి పరుగేమీ రాలేదు. ఐదో బాల్ని రిషాద్ లెగ్ సాధించగా.. బంతిని షాహీన్ ఆఫ్రిది డౌన్ ది లెగ్ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్ కనక్ట్ కాలేదు. దీంతో ఫీల్డ్ అంపైర్ వైడ్గా ప్రకటించాడు. వికెట్ కీపర్ లిట్టన్ దాస్ సూచన మేరకు బంగ్లా కెప్టెన్ రివ్యూ తీసుకున్నాడు. ఇక్కడే వివాదం చోటు చేసుకుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
- RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
- IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
Also Read: Sanju Samson: ఇన్స్పిరేషన్ నుంచి ఫేవరెట్ మూవీ వరకు.. సంజు రాపిడ్ ఫైర్ సమాధానాలు ఇవే!
రివ్యూలో బంతి వైడ్ కాదని, సరైన బంతేనని థర్డ్ అంపైర్ తేల్చాడు. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ ప్లేయర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బంగ్లా ఆటగాళ్లు మైదానంలోని బిగ్ స్క్రీన్పై రీప్లే చూసిన తర్వాతే.. రివ్యూకి వెళ్లారని పాక్ ఆరోపించింది. ఫీల్డ్ అంపైర్ నిర్ణయం అనంతరం 15 సెకన్లలోపే డీఆర్ఎస్ కోరాలని, నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా రివ్యూకు అంపైర్ అనుమతించడంపై పాక్ అసహనం వ్యక్తం చేసింది. ఇది మ్యాచ్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఈ విషయంపై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వివాదంపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
-
Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
-
Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?