Pakistan Cricket: ఐసీసీకి పోటీగా కొత్త క్రికెట్ బోర్డు.. పీసీబీ ప్రయత్నం ఆదిలోనే ఫెయిల్?
- ఐసీసీ స్థాయి క్రికెట్ సంస్థ ఏర్పాటుకు పీసీబీ ప్రయత్నం
- 8 క్రికెట్ బోర్డులను సంప్రదించిన పీసీబీ
- పీసీబీ ప్రయత్నం ఆదిలోనే ఫెయిల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో నవ్వులపాలవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ప్రత్యామ్నాయంగా.. తమకంటూ ఒక ఐసీసీ స్థాయి క్రికెట్ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పీసీబీ చేసిన ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అయినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు మద్దతు కోరుతూ పీసీబీ ఏకంగా 8 క్రికెట్ బోర్డులను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందులో కేవలం రెండు దేశాలు మాత్రమే మద్దతు ఇవ్వడంతో పీసీబీకి భారీ షాక్ తగిలింది.
కొత్త క్రికెట్ బోర్డు కోసం చైనా, బంగ్లాదేశ్, యూఏఈ, ఒమాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, జింబాబ్వే వంటి దేశాలతో పీసీబీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఐసీసీ నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్న దేశాలను ఏకం చేసి. కొత్త అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలన్నది పీసీబీ ప్లాన్గా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆలోచనకు ప్రపంచ క్రికెట్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. పీసీబీ సంప్రదించిన ఎనిమిది బోర్డుల్లో ఆరు బోర్డులు నో చెప్పినట్లు సమాచారం. యూఏఈ, ఒమాన్, సౌదీ అరేబియా, యుఎస్ఏ, వెస్టిండీస్, జింబాబ్వే ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు టాక్. కేవలం చైనా, బంగ్లాదేశ్ మాత్రమే పీసీబీ ఆలోచనకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.
Also Read
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
Also Read: No iPhone 18: యాపిల్ లవర్స్కు షాక్.. ‘ఐఫోన్ 18’ లేనట్లేనా?
ఆరు దేశాల తిరస్కరణతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఐసీసీ స్థాయి సంస్థ ఆలోచన మొదటి దశలోనే కుప్పకూలినట్టైంది. ఈ పరిణామంపై అటు క్రికెట్ అభిమానులు, ఇటు విశ్లేషకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఐసీసీకి పోటీగా మరో అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయడం అంత ఈజీనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందు పాకిస్థాన్ క్రికెట్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలని, ఆటపై దృష్టి పెట్టాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి పీసీబీ మరోసారి అనవసర నిర్ణయాలతో క్రికెట్ ప్రపంచంలో నవ్వుల పాలయ్యిందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
తాజావార్తలు
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!