Pakistan Cricket: ఐసీసీకి పోటీగా కొత్త క్రికెట్ బోర్డు.. పీసీబీ ప్రయత్నం ఆదిలోనే ఫెయిల్?
- ఐసీసీ స్థాయి క్రికెట్ సంస్థ ఏర్పాటుకు పీసీబీ ప్రయత్నం
- 8 క్రికెట్ బోర్డులను సంప్రదించిన పీసీబీ
- పీసీబీ ప్రయత్నం ఆదిలోనే ఫెయిల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో నవ్వులపాలవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ప్రత్యామ్నాయంగా.. తమకంటూ ఒక ఐసీసీ స్థాయి క్రికెట్ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పీసీబీ చేసిన ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అయినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు మద్దతు కోరుతూ పీసీబీ ఏకంగా 8 క్రికెట్ బోర్డులను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందులో కేవలం రెండు దేశాలు మాత్రమే మద్దతు ఇవ్వడంతో పీసీబీకి భారీ షాక్ తగిలింది.
కొత్త క్రికెట్ బోర్డు కోసం చైనా, బంగ్లాదేశ్, యూఏఈ, ఒమాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, జింబాబ్వే వంటి దేశాలతో పీసీబీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఐసీసీ నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్న దేశాలను ఏకం చేసి. కొత్త అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలన్నది పీసీబీ ప్లాన్గా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆలోచనకు ప్రపంచ క్రికెట్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. పీసీబీ సంప్రదించిన ఎనిమిది బోర్డుల్లో ఆరు బోర్డులు నో చెప్పినట్లు సమాచారం. యూఏఈ, ఒమాన్, సౌదీ అరేబియా, యుఎస్ఏ, వెస్టిండీస్, జింబాబ్వే ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు టాక్. కేవలం చైనా, బంగ్లాదేశ్ మాత్రమే పీసీబీ ఆలోచనకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.
Also Read
- India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
- Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
- ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
- Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
Also Read: No iPhone 18: యాపిల్ లవర్స్కు షాక్.. ‘ఐఫోన్ 18’ లేనట్లేనా?
ఆరు దేశాల తిరస్కరణతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఐసీసీ స్థాయి సంస్థ ఆలోచన మొదటి దశలోనే కుప్పకూలినట్టైంది. ఈ పరిణామంపై అటు క్రికెట్ అభిమానులు, ఇటు విశ్లేషకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఐసీసీకి పోటీగా మరో అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయడం అంత ఈజీనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందు పాకిస్థాన్ క్రికెట్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలని, ఆటపై దృష్టి పెట్టాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి పీసీబీ మరోసారి అనవసర నిర్ణయాలతో క్రికెట్ ప్రపంచంలో నవ్వుల పాలయ్యిందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Story Board : పంజా విసురుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!