Team India Sponsors: ఆన్లైనింగ్ గేమింగ్ బిల్లు ఎఫెక్ట్.. బీసీసీఐకి రూ.125 కోట్లు, ప్లేయర్స్ కు తీవ్ర నష్టం
- పార్లమెంట్లో ఆన్లైనింగ్ గేమింగ్కు సంబంధించి బిల్లు పాస్..
- టీమిండియా క్రికెట్ జట్టు స్పాన్సర్గా వైదొలిగిన డ్రీమ్ 11..
- బీసీసీఐకి రూ. 125 కోట్లు, ప్లేయర్లకు భారీ నష్టం వాటిల్లే ఛాన్స్..
Team India Sponsors: పార్లమెంట్లో ఆన్లైనింగ్ గేమింగ్కు సంబంధించి బిల్లు ఉభయ సభల్లో పాస్ అయింది. డబ్బులతో ముడిపడిన ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నిషేధించే కీలక బిల్లుకు ఆమోదం లభించడంతో.. అన్ని రకాల మనీ గేమ్లపై నిషేధం పడినట్లైంది. గత కొన్ని రోజుల పాటు టీమిండియా క్రికెట్ జట్టు స్పాన్సర్గా వ్యవహరిస్తోన్న డ్రీమ్ 11 వైదొలిగింది. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ 2025 మొదలుకానుంది. ఆలోపు కొత్త స్పాన్సర్ను బీసీసీఐ వెతికి పట్టుకోవాలి. లేకపోతే ఆసియా కప్లో స్పాన్సర్ లేకుండా ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాగా, ఇప్పటికే స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవడంతో రూ.125 కోట్ల మేర నష్టపోయే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. కేవలం బోర్డు పైనే కాకుండా ప్లేయర్స్ పై కూడా దీని ఎఫెక్ట్ తప్పదని న్యూస్ వినిపిస్తుంది.
Read Also: Robbery in Narsapur Express: రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్.. నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో దోపిడీ
Also Read
- Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
- Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
- World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
- IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్మెన్ దూరం..
ఇక, డ్రీమ్ 11 గేమింగ్ యాప్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్య సోదరులతో కాంట్రాక్ట్ చేసుకుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, సౌరభ్ గంగూలీ మై11 సర్కిల్తో ఒప్పందం కుదుర్చుకుంది. విరాట్ కోహ్లీ అయితే ఎంపీఎల్ను ప్రమోట్ కూడా చేశాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా విన్జోతో టైఅప్ అయ్యాడు. కానీ, ఒక్కొక్కరికి ఫీజు వేర్వేరుగా ఉంటుంది.
Read Also: Case Filed On TVK Chief: నటుడు విజయ్కి షాక్.. కేసు పెట్టిన పోలీసులు..
అయితే, విరాట్ కోహ్లీ కాంట్రాక్ట్ ప్రకారం ఏడాదికి రూ.12 కోట్ల వరకూ తీసుకుంటున్నాడు. సంవత్సరానికి రోహిత్, ధోనీ రూ.7 కోట్ల చొప్పున అందుకుంటున్నారు. అలాగే, యువ క్రికెటర్లకూ కనీసం రూ.కోటికి తక్కువ కాకుండా అందజేస్తున్నారు. టీమిండియా ప్లేయర్స్ అందరికి కలిపి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకూ ఇలాంటి కాంట్రాక్ట్ నుంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు నిషేధం విధించడంతో వీరిపై తీవ్ర ప్రభావం పడనుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Modi-Rabuka: ఎవరో మీతో సంతోషంగా లేరు.. మోడీతో ఫిజీ ప్రధాని వ్యాఖ్య
కాగా, ఆన్లైనింగ్ గేమింగ్ బిల్లు కేవలం భారత క్రికెట్ బోర్డు, ప్లేయర్ల మీదనే కాకుండా.. ఐపీఎల్ ఫ్రాంచైజీల పైనా తీవ్ర ప్రభావం చూపించనుంది. కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తదితర జట్లకు స్పాన్సర్లుగా గేమింగ్ యాప్లే ఉన్నాయి. కొందరు ఆటగాళ్లు తమ ఎండార్స్మెంట్ ఫోర్ట్ఫోలియోలో చాలా తక్కువ కాంట్రాక్ట్లు ఉన్నప్పటికీ.. ఎక్కువ మొత్తంలో ఆదాయం ఆర్జిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?