IPL 2022: ఈ ఏడాది రెండు గ్రూపులు.. కొత్త ఫార్మాట్లో మ్యాచ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 15వ సీజన్ కోసం కొత్త ఫార్మాట్ను నిర్వాహకులు అమలు చేయబోతున్నారు. ఈ ఏడాది జట్ల సంఖ్య 8 నుంచి 10కి పెరగడంతో మ్యాచ్ల సంఖ్యను తగ్గించేందుకు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. కానీ ఎప్పటిలాగే గ్రూప్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్లు ఆడనుంది. కొత్త ఫార్మాట్ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. గ్రూప్-ఎలో ముంబై, కోల్కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. గ్రూప్-బిలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ జట్లు ఉన్నాయి.
ఎక్కువ ట్రోఫీలు గెలిచిన జట్ల ఆధారంగా నంబర్లు కేటాయించారు. ఒక జట్టు అదే గ్రూప్లోని మిగతా జట్లతో రెండేసి మ్యాచ్లు, మరో గ్రూప్లోని జట్లతో ఒక మ్యాచ్ ఆడనుంది. అలాగే టేబుల్లో పక్కన ఉన్న టీంతో మరో మ్యాచ్ (1+1) ఆడుతుంది. ఈ లెక్కన ఒక్కో జట్టు 14 మ్యాచ్లు ఆడనుంది.
ఉదాహరణకు ముంబై ఇండియన్స్ జట్టు గ్రూప్-ఎలో ఉన్నందున.. అదే గ్రూప్లోని కోల్కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో టీమ్లతో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. అలాగే గ్రూప్-బిలోని హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ జట్లతో ఒక్కో మ్యాచ్తో పాటు పక్కనే ఉన్న చెన్నైతో రెండు మ్యాచ్లు ఆడనుంది. మార్చి 26న ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. లీగ్ దశలో 70 మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్లు ఉంటాయి.
Also Read
- KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
- MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్

తాజావార్తలు
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..