ఒలింపిక్స్ లో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా అదరగొట్టాడు. ఇవాళ జరిగిన జావెలిన్ త్రో పోటీల్లో గెలిచి ఫైనల్ కు అర్హత సాధించాడు. జావెలిన్ విభాగంలో ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయుడుగా రికార్డు సృష్టించాడు. ఈరోజు మ్యాచ్ లో అందరి కంటే ఎక్కువ దూరం అంటే 86.65 మీటర్లు జావెలిన్ విసిరాడు. 23 ఏళ్ల ఈ ప్లేయర్ తొలిసారి ఒలింపిక్స్ ఆడుతున్నాడు. ఆగస్టు 7న జరిగే ఫైనల్లో టాప్ – 3లో నిలిస్తే ఏదో ఒక పతకం రావడం ఖాయంగా కనిపిస్తోంది.