Neeraj Chopra: చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neeraj Chopra: స్టార్ ఇండియన్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా గురువారం మరో చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్లో ఛాంపియన్గా నిలిచిన భారత తొలి క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. అగ్రశ్రేణి అథ్లెటిక్స్ పోటీలో 88.44 అత్యుత్తమ త్రోను సాధించి విజేతగా నిలిచాడు. ఈ ట్రోఫీని సాధించడం తన కెరీర్లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో చోప్రా స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ప్రపంచంలోని ఆరుగురు మేటి జావెలిన్ త్రోయర్లు పోటీ పడ్డ తుది పోరులో నీరజ్ తన బల్లెంను అత్యధికంగా 88.44 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. తన రెండవ ప్రయత్నంలోనే చోప్రా అందరికంటే ఎక్కువ దూరం విసిరి స్వర్ణం సాధించడం విశేషం.
నీరజ్ చోప్రా తన మొదటి ప్రయత్నంలో ‘నో త్రో’గా ప్రకటించబడినందున అతనికి మంచి ప్రారంభం లభించలేదు. కాగా, జాకుబ్ వడ్లెజ్ 84.15 మీటర్ల త్రోతో ముందంజ వేశాడు. నీరజ్ తన రెండవ ప్రయత్నంలో 88.44 మీటర్ల అద్భుతమైన త్రోతో తిరిగి పోటీలోకి ప్రవేశించాడు. అది అతన్ని టేబుల్పై అగ్రస్థానానికి నెట్టివేసింది. వడ్లెజ్చ్ 86.00 మీటర్ల త్రోతో అతనిని వెంబడించాడు. నాలుగో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్ను 86.11 మీటర్ల దూరం విసిరాడు. నాల్గవ ప్రయత్నం ముగిసే సమయానికి, నీరజ్ ఆధిక్యంలో ఉన్నాడు, వాడ్లెజ్చ్ అతని నాల్గవ ప్రయత్నంలో 86.94 మీటర్ల త్రోతో అతనికి అత్యంత సమీప ఛాలెంజర్గా నిలిచాడు.
Also Read
- Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్రౌండర్లు ఒకేసారి అవుట్..
- VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు... వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా... వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
- Campbell Thomson: "ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
IND vs AFG: ఆఫ్ఘన్పై భారత్ ఘనవిజయం.. విరాట్ వీరవిహారం.. బౌలింగ్లో భువి అదుర్స్
గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్కు దూరంగా ఉన్న నీరజ్.. నెలన్నర విరామం తర్వాత జులై చివర్లో లాసానె డైమండ్ లీగ్లో విజేతగా నిలిచి ఫైనల్స్ కు అర్హత సాధించాడు. ఈ ఈవెంట్లో అతని అత్యుత్తమ త్రోతో, చోప్రా లాసాన్లో విజయంతో ప్రతిష్టాత్మకమైన డైమండ్ లీగ్ మీటింగ్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయుడు అయ్యాడు. ఈ విజయం తర్వాత నీరజ్ డైమండ్ లీగ్ ఫైనల్స్కు అర్హత సాధించాడు. డైమండ్ లీగ్ ఫైనల్లో అతను పోటీ పడటం ఇది మూడోసారి. గతంలో 2017, 2018 ఎడిషన్స్లో ఫైనల్స్ ఆడినా… వరుసగా ఏడు, నాలుగో స్థానాలతో సరిపెట్టాడు. ఈసారి మాత్రం స్వర్ణంతో తిరిగొచ్చాడు.
అథ్లెటిక్స్ లో ప్రపంచ చాంపియన్ షిప్స్, ఒలింపిక్స్ తర్వాత డైమండ్ లీగ్ను ఎంతో ప్రతిష్ఠాత్మక టోర్నీగా పరిగణిస్తారు. ఇందులో మొత్తం 32 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో 13 సిరీస్ ల్లో ప్రదర్శన ద్వారా అథ్లెట్లు.. ఫైనల్ ఈవెంట్ కు అర్హత సాధిస్తారు. ప్రతి కేటగిరీలో ఫైనల్లో నెగ్గిన విన్నర్ను డైమండ్ లీగ్ ఛాంపియన్ గా పిలుస్తారు. ప్రతి కేటగిరీలో విజేతకు సుమారు 24 లక్షల ప్రైజ్ మనీతో పాటు 2023 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు. భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా ఇవన్నీ సాధించాడు.
తాజావార్తలు
-
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
-
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!