Neeraj Chopra: చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neeraj Chopra: స్టార్ ఇండియన్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా గురువారం మరో చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్లో ఛాంపియన్గా నిలిచిన భారత తొలి క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. అగ్రశ్రేణి అథ్లెటిక్స్ పోటీలో 88.44 అత్యుత్తమ త్రోను సాధించి విజేతగా నిలిచాడు. ఈ ట్రోఫీని సాధించడం తన కెరీర్లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో చోప్రా స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ప్రపంచంలోని ఆరుగురు మేటి జావెలిన్ త్రోయర్లు పోటీ పడ్డ తుది పోరులో నీరజ్ తన బల్లెంను అత్యధికంగా 88.44 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. తన రెండవ ప్రయత్నంలోనే చోప్రా అందరికంటే ఎక్కువ దూరం విసిరి స్వర్ణం సాధించడం విశేషం.
నీరజ్ చోప్రా తన మొదటి ప్రయత్నంలో ‘నో త్రో’గా ప్రకటించబడినందున అతనికి మంచి ప్రారంభం లభించలేదు. కాగా, జాకుబ్ వడ్లెజ్ 84.15 మీటర్ల త్రోతో ముందంజ వేశాడు. నీరజ్ తన రెండవ ప్రయత్నంలో 88.44 మీటర్ల అద్భుతమైన త్రోతో తిరిగి పోటీలోకి ప్రవేశించాడు. అది అతన్ని టేబుల్పై అగ్రస్థానానికి నెట్టివేసింది. వడ్లెజ్చ్ 86.00 మీటర్ల త్రోతో అతనిని వెంబడించాడు. నాలుగో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్ను 86.11 మీటర్ల దూరం విసిరాడు. నాల్గవ ప్రయత్నం ముగిసే సమయానికి, నీరజ్ ఆధిక్యంలో ఉన్నాడు, వాడ్లెజ్చ్ అతని నాల్గవ ప్రయత్నంలో 86.94 మీటర్ల త్రోతో అతనికి అత్యంత సమీప ఛాలెంజర్గా నిలిచాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
- T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
IND vs AFG: ఆఫ్ఘన్పై భారత్ ఘనవిజయం.. విరాట్ వీరవిహారం.. బౌలింగ్లో భువి అదుర్స్
గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్కు దూరంగా ఉన్న నీరజ్.. నెలన్నర విరామం తర్వాత జులై చివర్లో లాసానె డైమండ్ లీగ్లో విజేతగా నిలిచి ఫైనల్స్ కు అర్హత సాధించాడు. ఈ ఈవెంట్లో అతని అత్యుత్తమ త్రోతో, చోప్రా లాసాన్లో విజయంతో ప్రతిష్టాత్మకమైన డైమండ్ లీగ్ మీటింగ్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయుడు అయ్యాడు. ఈ విజయం తర్వాత నీరజ్ డైమండ్ లీగ్ ఫైనల్స్కు అర్హత సాధించాడు. డైమండ్ లీగ్ ఫైనల్లో అతను పోటీ పడటం ఇది మూడోసారి. గతంలో 2017, 2018 ఎడిషన్స్లో ఫైనల్స్ ఆడినా… వరుసగా ఏడు, నాలుగో స్థానాలతో సరిపెట్టాడు. ఈసారి మాత్రం స్వర్ణంతో తిరిగొచ్చాడు.
అథ్లెటిక్స్ లో ప్రపంచ చాంపియన్ షిప్స్, ఒలింపిక్స్ తర్వాత డైమండ్ లీగ్ను ఎంతో ప్రతిష్ఠాత్మక టోర్నీగా పరిగణిస్తారు. ఇందులో మొత్తం 32 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో 13 సిరీస్ ల్లో ప్రదర్శన ద్వారా అథ్లెట్లు.. ఫైనల్ ఈవెంట్ కు అర్హత సాధిస్తారు. ప్రతి కేటగిరీలో ఫైనల్లో నెగ్గిన విన్నర్ను డైమండ్ లీగ్ ఛాంపియన్ గా పిలుస్తారు. ప్రతి కేటగిరీలో విజేతకు సుమారు 24 లక్షల ప్రైజ్ మనీతో పాటు 2023 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు. భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా ఇవన్నీ సాధించాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!