MI vs RCB: ముగిసిన ముంబై బ్యాటింగ్.. చీల్చిచెండాడిన తిలక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians Batting Innings Completed Against RCB: ఎమ్. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. యువ ఆటగాడు తిలక్ వర్మ విజృంభణతోనే ముంబై జట్టు ఈ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఐదో స్థానంలో వచ్చిన ఈ ఆటగాడు.. ఆచితూచి ఆడుతూనే, బంతులు దొరికినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. తిలక్ మాత్రం ఒత్తిడికి గురవ్వకుండా, చాలా కూల్గా తన ఇన్నింగ్స్ కొనసాగించాడు. 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సుల సహకారంతో 84 పరుగులు సాధించాడు. ఒంటరి పోరాటం చేస్తూ.. తన జట్టుకి మంచి స్కోరుని అందించాడు.
Donald Trump: కేసులు ఉన్నా తగ్గని ఆదరణ.. ట్రంపుకు ఒకే రోజు భారీ విరాళం..
Also Read
- Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
- Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
నిజానికి.. టాపార్డర్ ఘోరంగా విఫలం కావడం, అంచనాలు పెట్టుకున్న ప్లేయర్లందరూ చేతులెత్తేయడం చూసి, ముంబై జట్టు 120 పరుగుల మార్క్ని అందుకోవడం కూడా కష్టమేనని అనిపించింది. మొదటి 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 55 పరుగులే చేయడంతో.. ఇక ముంబై పని అయిపోయినట్టేనని అంతా ఫిక్స్ అయ్యారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి హేమాహేమీలే వికెట్లు కోల్పోవడంతో.. స్వల్ప స్కోరుకే ముంబై చాపచుట్టేస్తుందని భావించారు. కానీ.. ఆ ఊహాగానాల్ని తిలక్ వర్మ తిప్పికొట్టాడు. ముంబై జట్టుకి తానున్నానంటూ.. ఒంటరి పోరు సాగించాడు. ఆర్సీబీ బౌలింగ్ ఎటాక్ని స్టార్ ప్లేయర్లు ఎదుర్కోలేకపోతే.. ఇతడు మాత్రం తాండవం చేశాడు. అనవసరమైన టెంప్టింగ్ షాట్ల జోలికి వెళ్లకుండా.. ఎంతో శ్రద్ధగా పరుగుల వర్షం కురిపించాడు. అతడు సినిమాలో డైలాగ్ ఉన్నట్టు.. ఎవడైనా కోపంగా కొడతాడు లేదా బలంగా కొడతాడు, కానీ ఈ వీడు మాత్రం శ్రద్ధగా, ఏదో గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకి అంటు కడుతున్నట్టుగా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడు. నిజంగా ఈ మ్యాచ్కి మాత్రం వీడు మగాడ్రా బుజ్జి.
China: 8 ఏళ్ల బాలుడిని చూసి భయపడుతున్న చైనా.. అసలేంటి ఆ స్టోరీ..?
ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికొస్తే.. కరణ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, టోప్లే, ఆకాశ్, హర్షల్, బ్రేవ్వెల్ తలా వికెట్ తీసుకున్నారు. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్ వేసిన ఆర్సీబీ.. చివర్లో మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకుంది. యువ ఆటగాళ్లే కదా.. ఏం కొడతారులే అని లైట్ తీసుకున్నారో ఏమో గానీ.. చివర్లో మాత్రం వీళ్లు తేలిపోయారు. సిరాజ్ అయితే 19వ ఓవర్లో వైడ్ల వర్షం కురిపించాడు. ఇక చివరి బంతికి హెలికాప్టర్ షాట్తో సిక్స్ కొట్టి, తిలక్ ముగించిన తీరు మాత్రం.. ఈ మ్యాచ్కే హైలైట్ అని చెప్పుకోవాలి.
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?