ODI World Cup 2023: భారత అభిమానులకు శుభవార్త.. టీమిండియాలోకి ఎంఎస్ ధోనీ ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is MS Dhoni Mentor for Team India in ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ప్రపంచకప్ కోసం డ్రాఫ్ట్ షెడ్యూల్ను బీసీసీఐ ఇప్పటికే రిలీజ్ చేసింది. ఆ షెడ్యూల్ను ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డులకు పంపింది. త్వరలోనే ప్రపంచకప్ 2023కి సంబందించిన అధికారిక షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ మెగా టోర్నమెంట్కు ముందు భారత అభిమానులకు ఓ శుభవార్త అందే అవకాశం ఉంది.
2011 నుంచి భారత్ ఒక్క ప్రపంచకప్ టోర్నీని కూడా గెలవలేదు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ 2011ని భారత్ దక్కించుకుంది. ఆపై 2013లో ధోనీ నాయకత్వంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పటికి 10 ఏళ్లు అవుతున్నా.. టీమిండియా ఖాతాలో ఒక్క ఐసీసీ టైటిల్ లేదు. 2015, 2019లో వన్డే ప్రపంచకప్లు.. 2012, 2014, 2016, 2021, 2022లో టీ20 ప్రపంచకప్లు జరిగినా భారత్ గెలవలేకపోయింది. ఇక 2019, 2023లో టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్యూటీసీ) ఫైనల్లో కూడా టీమిండియాకు నిరాశే ఎదురైంది. దాంతో ఓ ఐసీసీ ట్రోఫీ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
- Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
Also Read: Ashada Bonalu 2023: నేటినుంచే ఆషాడ బోనాలు షురూ.. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం!
ఇప్పుడు వన్డే ప్రపంచకప్ 2023 సొంతగడ్డపై జరుగనున్న నేపథ్యంలో భారత పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది. అంతేకాదు ట్రోఫీ గెలిచేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. వన్డే ప్రపంచకప్ టార్గెట్గా బరిలోకి దిగుతున్న భారత్.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సేవలను ఉపయోగించుకోవాలి చూస్తోంది. ఈ క్రమంలోనే ధోనీకి బీసీసీఐ పెద్ద బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది. ప్రపంచకప్లో ధోనీని భారత జట్టు మెంటార్గా నియమించాలని బీసీసీఐ భావిస్తోందట. త్వరలోనే ఈ విషయంపై ఓ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
2021లో జరిగిన టీ20 ప్రపంచకప్లో ఎంఎస్ ధోనీని భారత జట్టుకు బీసీసీఐ మెంటార్గా నియమించింది. అతని మార్గదర్శకత్వంలో క్రీడాకారులు బాగానే ఆడారు. అందుకే మహీ అనుభవాన్ని వన్డే ప్రపంచకప్ 2023లో ఉపయోగించుకోవాలని బీసీసీఐ చూస్తోంది. ధోనీ భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్కు అందించాడు.
Also Read: Gold Price Today: వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు హైదరాబాద్లో తులం ఎంతంటే?
తాజావార్తలు
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!