ODI World Cup 2023: భారత అభిమానులకు శుభవార్త.. టీమిండియాలోకి ఎంఎస్ ధోనీ ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is MS Dhoni Mentor for Team India in ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ప్రపంచకప్ కోసం డ్రాఫ్ట్ షెడ్యూల్ను బీసీసీఐ ఇప్పటికే రిలీజ్ చేసింది. ఆ షెడ్యూల్ను ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డులకు పంపింది. త్వరలోనే ప్రపంచకప్ 2023కి సంబందించిన అధికారిక షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ మెగా టోర్నమెంట్కు ముందు భారత అభిమానులకు ఓ శుభవార్త అందే అవకాశం ఉంది.
2011 నుంచి భారత్ ఒక్క ప్రపంచకప్ టోర్నీని కూడా గెలవలేదు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ 2011ని భారత్ దక్కించుకుంది. ఆపై 2013లో ధోనీ నాయకత్వంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పటికి 10 ఏళ్లు అవుతున్నా.. టీమిండియా ఖాతాలో ఒక్క ఐసీసీ టైటిల్ లేదు. 2015, 2019లో వన్డే ప్రపంచకప్లు.. 2012, 2014, 2016, 2021, 2022లో టీ20 ప్రపంచకప్లు జరిగినా భారత్ గెలవలేకపోయింది. ఇక 2019, 2023లో టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్యూటీసీ) ఫైనల్లో కూడా టీమిండియాకు నిరాశే ఎదురైంది. దాంతో ఓ ఐసీసీ ట్రోఫీ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read
- Rohit Sharma: హిట్మ్యాన్ రిటైర్మెంట్పై జోరుగా చర్చ.. టీమిండియా కోచ్ కీలక ప్రకటన
- Mithali Raj: ఇకనైనా 'స్మృతి మందాన'ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
- Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
- India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
Also Read: Ashada Bonalu 2023: నేటినుంచే ఆషాడ బోనాలు షురూ.. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం!
ఇప్పుడు వన్డే ప్రపంచకప్ 2023 సొంతగడ్డపై జరుగనున్న నేపథ్యంలో భారత పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది. అంతేకాదు ట్రోఫీ గెలిచేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. వన్డే ప్రపంచకప్ టార్గెట్గా బరిలోకి దిగుతున్న భారత్.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సేవలను ఉపయోగించుకోవాలి చూస్తోంది. ఈ క్రమంలోనే ధోనీకి బీసీసీఐ పెద్ద బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది. ప్రపంచకప్లో ధోనీని భారత జట్టు మెంటార్గా నియమించాలని బీసీసీఐ భావిస్తోందట. త్వరలోనే ఈ విషయంపై ఓ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
2021లో జరిగిన టీ20 ప్రపంచకప్లో ఎంఎస్ ధోనీని భారత జట్టుకు బీసీసీఐ మెంటార్గా నియమించింది. అతని మార్గదర్శకత్వంలో క్రీడాకారులు బాగానే ఆడారు. అందుకే మహీ అనుభవాన్ని వన్డే ప్రపంచకప్ 2023లో ఉపయోగించుకోవాలని బీసీసీఐ చూస్తోంది. ధోనీ భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్కు అందించాడు.
Also Read: Gold Price Today: వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు హైదరాబాద్లో తులం ఎంతంటే?
తాజావార్తలు
-
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
-
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
-
School Van Hit by Train: ఘోర ప్రమాదం… స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
-
Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
-
Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!