Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
- మహ్మద్ ఆమీర్కు బ్రిటిష్ పౌరసత్వం..?
- యూకే పాస్పోర్టు పొందిన పాక్ క్రికెటర్..
- ఐపీఎల్లో ఆడే ఛాన్స్ వస్తుందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Amir: పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ మహమ్మద్ ఆమీర్ బ్రిటీష్ పౌరుడిగా మారినట్లు తెలుస్తోంది. ఆమీర్కు యునైటెడ్ కింగ్డమ్ పౌరసత్వం లభించినట్లు తెలుస్తోంది. దీంతో అతను ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమీర్ భార్య నర్గీస్ ఖాన్ బ్రిటీష్ పౌరురాలు. దీంతో ఆయన కూడా కొన్నేళ్ల క్రితం బ్రిటిష్ సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. చట్టపరమైన అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత అతడికి తాజాగా యూకే పాస్పోర్టు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్గా ఉన్న అమీర్, ఇప్పుడు బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత ఐపీఎల్ వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుందనే అనే ప్రశ్నలు ఉత్పన్నతమవుతున్నాయి. నిజానికి 2008లో జరిగిన ఐపీఎల్ తొలి సీజన్లో మాత్రమే పాక్ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం విధించారు. ఆ తర్వాత పాకిస్తాన్లో జన్మించిన అజహర్ మహమూద్ మాత్రమే 2012 నుంచి 2015 మధ్య ఐపీఎల్ ఆడాడు. ఇతను కూడా బ్రిటిష్ పాస్పోర్టు పొందిన తర్వాతే ఐపీఎల్లో ఇంగ్లీష్ ప్లేయర్గా 23 మ్యాచ్లు ఆడారు.
Also Read
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
- Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
- SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
ఈ నేపథ్యంలో మహ్మద్ ఆమీర్ ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. ఆమీర్ ఇప్పుడు విదేశీ ఆటగాళ్ల విభాగంలో వేలం కోసం తన పేరు నమోదు చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఇంగ్లాండ్ పౌరసత్వం పొందినంత మాత్రాన ఆయన ఐపీఎల్లో ఆడే అవకాశం రాదు. కౌంటీ క్రికెట్ నియమాల ప్రకారం.. కేవలం బ్రిటిష్ పౌరుడైతే సరిపోదు, ఒక ఆటగాడు గత 12 నెలల్లో ఇంగ్లాండ్ బయట ఉన్న పూర్తి సభ్యదేశం తరుఫున ప్రొపెషనల్ క్రికెట్ ఆడి ఉండకూడదు. కానీ ఆమీర్ పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో రావల్పిండి తరుపున ఆడారు. దీంతో, యూకే పాస్పోర్ట్ పొందిన వెంటనే అతడికి ఇంగ్లాండ్లో స్థానిక హోదా లభించదు.
ఆమిర్ 2024 డిసెంబర్లో రెండవసారి అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అతను పాకిస్థాన్ తరపున 36 టెస్టులు, 61 వన్డేలు, మరియు 62 టీ20లు ఆడాడు. అతను 2017 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన పాకిస్థాన్ జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఫైనల్లో, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ల వికెట్లు తీసి అతను మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. 34 ఏళ్ల ఆమిర్, జనవరి 2025 నుంచి 59 టీ20 మ్యాచ్లు ఆడి, 22.88 సగటుతో, 8.19 ఎకానమీతో 75 వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
-
US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!