Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్గా రేర్ రికార్డు!
- యువ పేసర్ క్రాంతి గౌడ్కు 5 వికెట్లు
- లార్డ్స్లో ఇంగ్లాండ్ 170 ఆలౌట్
- తొలి మహిళా బౌలర్గా క్రాంతి గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kranti Gaud 5 Wickets at Lord’s Test: భారత మహిళా క్రికెట్ జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టు క్రికెట్లో ఐదు వికెట్లు తీసిన తొలి మహిళా బౌలర్గా రికార్డుల్లో నిలిచింది. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో క్రాంతి గౌడ్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఈ రికార్డు ఆమె ఖాతాలో చేరింది. అంతేకాకుండా ఈ చారిత్రక వేదికపై ఏ ఫార్మాట్లోనైనా ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్గా కూడా నిలిచింది.
కెరీర్లో రెండో టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడుతున్న 22 ఏళ్ల క్రాంతి గౌడ్.. లార్డ్స్ టెస్టులో 35 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. ఆమె అద్భుత బౌలింగ్తో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 115 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట ప్రారంభమైన వెంటనే క్రాంతి గౌడ్ తన జోరును కొనసాగించింది. నాలుగో బంతికే మయా బౌచియర్ను ఔట్ చేసింది. తొలి రోజే ఇంగ్లండ్ తరఫున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న టామీ బ్యూమాంట్ను క్రాంతి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు పంపింది.
Also Read
- Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్దే టైటిల్!
- IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్కు లక్కీ ఛాన్స్!
- Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో తొలి వ్యక్తిగత 'స్వర్ణం' కైవసం.!
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్పై భారత్ 19-0తో సంచలన విజయం.!
ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ క్రాంతి గౌడ్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. అలీస్ క్యాప్సీని అద్భుతమైన బంతితో బౌల్డ్ చేసిన క్రాంతి.. ఇంగ్లండ్ను మరింత ఒత్తిడిలోకి నెట్టింది. హీథర్ నైట్ కూడా తొలి సెషన్లోనే ఔట్ కావడంతో ఆతిథ్య జట్టు 32 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నాట్ స్కివర్-బ్రంట్, అమీ జోన్స్ కలిసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే అమీ జోన్స్ను స్నేహ్ రాణా ఔట్ చేయడంతో ఆ భాగస్వామ్యానికి తెరపడింది. లంచ్ తర్వాత మళ్లీ బౌలింగ్కు వచ్చిన క్రాంతి.. ఇంగ్లండ్ కెప్టెన్ స్కివర్-బ్రంట్ను పెవిలియన్కు పంపి కీలక దెబ్బ కొట్టింది. అనంతరం లారెన్ బెల్ను ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకుంది.
రెండో ఇన్నింగ్స్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి తన సత్తా చాటింది. అర్ధశతకంతో రాణించి భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచింది. షఫాలీ వర్మ 33 పరుగులు చేయగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మంధాన 69 పరుగులతో, యాస్తికా భాటియా 39 పరుగులతో అజేయంగా నిలిచారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆధిక్యం 269 పరుగులకు చేరుకుంది. మూడో రోజు ఈ ఆధిక్యాన్ని 400 పరుగులకు పైగా తీసుకెళ్లి ఇంగ్లండ్పై చారిత్రక విజయాన్ని సాధించాలని భారత మహిళల జట్టు చూస్తోంది. క్రాంతి గౌడ్ చారిత్రక ఐదు వికెట్ల ప్రదర్శనతో ప్రస్తుతం ఈ ప్రతిష్ఠాత్మక టెస్టులో భారత్ పటిష్ఠ స్థితిలో నిలిచింది.
తాజావార్తలు
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?