IPL 2022: శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు.. జట్టు ఎంపికలో సీఈవో పాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రేయస్ సంచలన విషయాలు బయటపెట్టాడు. తమ జట్టు ఎంపికలో కోచ్తో పాటు సీఈవో వెంకీ కూడా పాల్గొంటారంటూ వ్యాఖ్యానించాడు. 11 మంది సభ్యుల తుది జట్టులో నీకు చోటు లేదంటూ మరో ఆటగాడికి చెప్పడం ఎంతో కష్టంగా ఉంటుందన్నాడు. ఐపీఎల్ ప్రారంభంలో తాను కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు శ్రేయస్ అయ్యర్ గుర్తుచేశాడు. కాగా శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జట్టు ఎంపికలో సీఈవో పాత్ర ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు జట్టు విషయాల గురించి తాము కోచ్లతో చర్చిస్తుంటామని.. అయితే సీఈవో సైతం జట్టు ఎంపికలో పాలుపంచుకుంటారని శ్రేయస్ అయ్యర్ వివరించాడు. ముఖ్యంగా బ్రెండన్ మెక్ కల్లమ్ ముఖ్యపాత్ర పోషిస్తాడని చెప్పాడు. నిజంగా చెప్పాలంటే తాను ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ ఎంతో మద్దతుగా నిలుస్తున్నారని తెలిపాడు. మైదానంలో ఒకరికొకరు సహకారంతో పనిచేస్తూ మంచి ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నాడు. అందుకే కెప్టెన్గా తాను గర్వపడుతున్నానని చెప్పాడు.
Also Read
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!