Kane Williamson: గుజరాత్ టైటాన్స్కు షాక్.. ఐపీఎల్ నుంచి కేన్ ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kane Williamson Ruled Out Of IPl 2023 Due To Knee Injury: ఐపీఎల్ 16వ సీజన్లో తొలి విజయాన్ని అందుకున్నామన్న ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేలోపే.. గుజరాత్ టైటాన్స్కి ఓ భారీ దెబ్బ తగిలింది. అత్యంత కీలక ఆటగాడైనా కేన్ విలియమ్సన్.. గాయం కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. శుక్రవారం (మార్చి 31వ తేదీన) రాత్రి చెన్నై ఇన్నింగ్స్లో భాగంగా.. రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన సిక్స్ని ఆపే ప్రయత్నంలో, బౌండరీ లైన్ వద్ద కేన్ విలియమ్సన్ డైవ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే అతని మోకాలికి తీవ్ర గాయమైంది. ఆ గాయం నొప్పితో అతడు విలవిల్లాడటంతో.. నడవలేకపోయాడు. దీంతో.. అతడ్ని సిబ్బంది తమ భుజాలపై ఎత్తుకొని వెళ్లింది. అతడు ఆడే పరిస్థితిలో లేకపోవడంతో.. అతని స్థానంలో సుదర్శన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా రంగంలోకి దింపారు.
Vijay Yesudas: యేసుదాసు తనయుడి ఇంట్లో భారీ చోరీ.. నగలు, పత్రాలు మాయం
Also Read
- Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
- ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
- Hyderabad: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫ్యాన్స్కు పండగే..
కేన్ విలియమ్సన్కి గాయం అయినప్పుడే.. అందరికీ అనుమానాలు వచ్చాయి. ఒకవేళ ఇది తీవ్రమైతే.. అతడు ఈ సీజన్ నుంచి వైదొలగొచ్చని భావించారు. మరికొందరు మాత్రం.. తదుపరి మ్యాచ్కల్లా కేన్ కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ.. అందరూ అనుమానించిందే నిజం అయ్యింది. వైద్య పరీక్షల తర్వాత కేన్కి తగిలిన గాయం తీవ్రమైందని తేలింది. అతని మోకాలికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. దీన్నుంచి కోలుకోవాలంటే.. కనీసం 45 రోజుల నుంచి 60 రోజుల వరకు విశ్రాంతి అవసరం. ఈ తరుణంలోనే కేన్ ఈ ఐపీఎల్ సీజన్కి దూరం కానున్నాడు. ఈ విషయంపై గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ మాట్లాడుతూ.. కేన్ మోకాలికి తీవ్రమైన గాయమైందని, అతడు తర్వాతి మ్యాచుల్లో ఆడే పరిస్థితి కష్టమేనని బాంబ్ పేల్చాడు. ఎంతో అనుభవజ్ఞుడైన కేన్, గాయం కారణంగా ఇలా దూరమవ్వడంతో.. గుజరాత్ టైటాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
KKR vs PBKS : ముగిసిన పంజాబ్ బ్యాటింగ్.. కోల్కతా టార్గెట్ 192
ఇక గుజరాత్, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతురాజ్ గౌక్వాడ్ 92 పరుగులతో తాండవం చేయడంతో.. చెన్నై ఆ స్కోరు చేయగలిగింది. ఇక 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. మరో నాలుగు బంతులు మిగిలుండగానే 182 పరుగులు చేసి, ఆ లక్ష్యాన్ని ఛేధించింది. శుభ్మన్ గిల్ అర్థశతకంతో రాణించగా.. మిగిలిన ఆటగాళ్లు కూడా తమవంతు కృషి చేయడంతో.. గుజరాత్ సునాయాసంగా చెన్నైని ఓడించగలిగింది.
తాజావార్తలు
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?