Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
- మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ
- విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం ఇచ్చిన హిట్మ్యాన్
- ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్కు తెలుసు
- రోహిత్కు పాక్ మాజీ స్టార్ మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamran Akmal Backs Rohit Sharma Amid Retirement Rumors: ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమి పాలై సిరీస్ను 2-1తో కోల్పోయినా.. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడిన అద్భుత సెంచరీ మాత్రం అందరి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో 138 పరుగులతో మెరిసిన రోహిత్.. విమర్శకులకు తన బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్పై పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ ఇంకా ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఒకడని పేర్కొన్నాడు. హిట్మ్యాన్కు ఎప్పుడు తప్పుకోవాలో తెలుసు అని, మీరు మూసుకుంటే బెటర్ అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.
‘ది గేమ్ ప్లాన్’ పోడ్కాస్ట్లో కమ్రాన్ అక్మల్ మట్లాడుతూ… ‘టీమిండియాపై సిరీస్ గెలవడానికి ఇంగ్లండ్కు అన్ని అర్హతలు ఉన్నాయి. లార్డ్స్ వన్డేలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మాత్రం రోహిత్ శర్మ సెంచరీనే. హిట్మ్యాన్ భవిష్యత్తుపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. 2027 ప్రపంచ కప్ ప్రణాళికల్లో అతడు ఉండడని కూడా ప్రచారం జరిగింది. అయితే లార్డ్స్లో ఆడిన ఈ ఇన్నింగ్స్తో రోహిత్ తన బ్యాట్ ద్వారానే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో తాను ఇప్పటికీ ఒకడినని నిరూపించాడు. హిట్మ్యాన్ బ్యాటింగ్ అద్భుతం’ అని అన్నాడు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
- Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లను విమర్శల ఆధారంగా అంచనా వేయకూడదని కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు. ‘దిగ్గజ ఆటగాళ్లను వారి ప్రదర్శనల ఆధారంగానే అంచనా వేయాలి. రోహిత్, కోహ్లీ లాంటి క్రికెటర్లను ఎవరూ బలవంతంగా జట్టు నుంచి పంపించలేరు. ఎప్పుడు తప్పుకోవాలో వారే నిర్ణయించుకుంటారు. భారత క్రికెట్ కోసం ఇద్దరూ ఎన్నో త్యాగాలు చేశారు. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినా వెనుకాడలేదు. అందుకే వారు ఇప్పటికీ సూపర్ స్టార్లుగా కొనసాగుతున్నారు. విమర్శలు, ఫామ్ కోల్పోవడం సహజమే. రో-కోలనుతప్పించడం ఎవరి వల్ల కాదు. విమర్శకులు, మాజీలు ట్రోల్స్ చేయకుంటే బెటర్’ అని అక్మల్ సూచించాడు.
భారత్ బ్యాటింగ్ బాగానే ఉన్నప్పటికీ బౌలర్ల వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని అక్మల్ చెప్పాడు. ‘ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ భారీగా పరుగులు ఇచ్చారు. గుర్నూర్ బ్రార్ ఏకంగా 97 పరుగులు ఇవ్వడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ప్రధాన బౌలర్లు ఒక్కొక్కరు 70 నుంచి 100 పరుగుల వరకు ఇస్తే ప్రత్యర్థిని నియంత్రించడం చాలా కష్టం. జట్టులో కుల్దీప్ యాదవ్ లేకపోవడం కూడా భారత్కు తీవ్ర నష్టం కలిగించింది. అక్షర్ పటేల్ ఒక్కడే ప్రధాన స్పిన్నర్గా ఉండడంతో బౌలింగ్లో వైవిధ్యం కనిపించలేడు. వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న కుల్దీప్ ఆడుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. చివరి ఐదు ఓవర్లలో భారత్ 80కు పైగా పరుగులు ఇవ్వడం మ్యాచ్ను పూర్తిగా ఇంగ్లండ్ వైపు తిప్పింది. బౌలింగ్ విభాగంలో అనుభవలేమి స్పష్టంగా కనిపించింది’ అని అక్మల్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!