Ishan Kishan: రంజీలోనూ అదే దూకుడు.. శతకం బాదిన ఇషాన్ కిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan Scored Century In Ranji Trophy Against Kerala: భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ద్విశతకం (210) బాదిన విషయం అందరికీ తెలిసిందే! క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు.. కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో.. వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన వరల్డ్ రికార్డ్ని నమోదు చేశాడు. ఇంతకుముందు క్రిస్ గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా.. ఆ రికార్డ్ని ఇషాన్ పాతాళానికి తొక్కేశాడు. అంతేకాదండోయ్.. వన్డేల్లో ఒక్క సెంచరీ నమోదు చేయకుండానే, నేరుగా ద్విశతకం చేసిన ఏకైక క్రికెటర్గానూ ఇషాన్ చరిత్రపుటలకెక్కాడు.
అదే జోరుని ఇప్పుడు రంజీ ట్రోఫీలోనూ ఇషాన్ కొనసాగిస్తున్నాడు. ఆ డబుల్ సెంచరీ చేసి వారం రోజులు కాకుండా.. రంజీలో శతకం బాదేశాడు. జార్ఖండ్, కేరళ మధ్య జరుగుతున్న మ్యాచ్లో అతడు 195 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్ల సహకారంతో 132 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో అతనికి ఇది ఆరో శతకం. ఈ మ్యాచ్లో జార్ఖండ్ 114 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయినప్పుడు.. ఇషాన్ క్రీజులోకి దిగాడు. సౌరభ్ తివారీ (97)తో కలిసి.. స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. వీళ్లిద్దరు కలిసి.. ఐదో వికెట్కి 200కి పైగా భాగస్వామ్యాన్ని జోడించారు. వీళ్లిద్దరు ఆడిన అద్భుత ఇన్నింగ్స్ల కారణంగానే.. కేరళ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 340 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జార్ఖండ్ ఆలౌట్ అయ్యాక బరిలోకి దిగిన కేరళ.. రెండో ఇన్నింగ్స్లో భాగంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 60 పరుగులు చేసింది.
Also Read
- India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?
- Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
తాజావార్తలు
-
Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
-
Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
-
CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
-
Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
-
LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..