SRH vs RCB: సన్ రైజర్స్ విక్టరీ.. 25 రన్స్ తేడాతో గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు బిగ్ ఫైట్ జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు నమోదయ్యాయి. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. మ్యాచ్ కు హైలెట్ అంటే దినేష్ కార్తీక్ అని చెప్పాలి. దాదాపు మ్యాచ్ గెలిచినంత దగ్గరగా తీసుకొచ్చాడు. డీకే ఔట్ కాకుండా ఉంటే.. ఆర్సీబీ మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది. ఈ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 35 బంతుల్లో 83 పరుగులు చేశాడు.
ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లీ (42), డుప్లెసిస్ (62) పరుగులతో మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన విల్ జాక్స్ (7), రజత్ పాటిదార్ (9) పరుగులు చేశారు. దినేష్ కార్తీక్ (83), మహిపాల్ లోమ్రోర్ (19), చివరలో అనుజ్ రావత్ (25) పరుగులు చేశారు. ఇంత భారీ స్కోరు చేసిన సన్ రైజర్స్.. ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయింది. వీళ్లు కూడా పరుగులు అనర్గళంగా సమర్పించారు. కేవలం కెప్టెన్ కమిన్స్ మాత్రమే 3 వికెట్లు తీయగా.. మయాంక్ మార్కండే 2, నటరాజన్ ఒక వికెట్ తీశాడు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
Attack on CM YS Jagan Case: సీఎం జగన్పై దాడి కేసు.. దర్యాప్తు ముమ్మరం..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. చినస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. వరుస సిక్సర్లతో సన్ రైజర్స్ బ్యాటర్స్ విరుచుకుపడ్డారు. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ సెంచరీతో రాణించాడు. కేవలం 41 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ (34), క్లాసెన్ (67) పరుగులతో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
మార్క్రమ్ (32) పరుగులు, చివరలో అబ్దుల్ సమద్ (37) పరుగులతో రాణించడంతో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు చేసింది. ఈ స్కోరుతో సన్ రైజర్స్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఈ మ్యాచ్ లో వీర విహారం చేయడంతో 278 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్ రైజర్స్ రికార్డు నెలకొల్పింది. కాగా.. సన్ రైజర్స్ బ్యాటర్స్ ముందు బెంగళూరు బౌలర్లు బిత్తర పోయారు. బాల్ ఎక్కడ వేసినా సరే.. బౌండరీ దాటాల్సిందేన్నట్లుగా చితకబాదారు. ఆర్సీబీ బౌలింగ్ లో అందరూ భారీ పరుగులు సమర్పించుకున్నారు. ఫెర్గ్యూసన్ 2 వికెట్లు పడగొట్టాడు. టోప్లీకి ఒక వికెట్ దక్కింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!